Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండిగో విమానానికి తప్పిన ముప్పు... 169 మంది ప్రయాణికులు సేఫ్

ఠాగూర్
బుధవారం, 9 జులై 2025 (16:04 IST)
ఇండిగో విమానానికి పెను ముప్పుతప్పింది. దీంతో ఆ విమానంలో ఉన్న 169 మంది ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు తప్పింది. ఈ విమానం పాట్నా నుంచి ఢిల్లీకి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నా విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఇండిగో విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ఈ ప్రమాదం జరిగింది. పక్షి బలంగా ఢీకొట్టడంతో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో అప్రమత్తమైన పైలెట్ వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించి పాట్నాలోనే సురక్షితంగా ల్యాండింగ్ చేశారు. ఈ విమానానికి మరమ్మతులు చేసిన తర్వాత ఢిల్లీకి బయలుదేరింది.
 
కాగా, ఇటీవలికాలంలో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతుండటం గమనార్హం. ఇటీవలే పాట్నా నుంచి రాంచీ వెళుతున్న మరో ఇండిగో విమానాన్ని గాల్లో ఓ గద్ద ఢీకొట్టింది. ఆ సమయంలో విమానం దాదాపు 4 వేల అడుగుల ఎత్తులో ఉంది. ఈ ఘటనలో 175 మంది ప్రయాణికులు ఉండగా, పైలెట్ చాకచర్యగా రాంచీలోని బిర్సా ముండా విమానాశ్రయంలో సురక్షితంగా దించారు. 
 
అలాగే, జూన్ 23వ తేదీన తిరువనంతపురానికి వచ్చిన ఎయిరిండియా విమానం ల్యాండ్ అవుతున్నపుడు పక్షి ఢీకొట్టి ఉంటుందని అనుమానించారు. ఈ కారణంగా తిరువనంతపురం నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన రిటర్న్ ఫ్లైట్‌ను ఎయిరిండియా రద్దు చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మై విలేజ్ షో కంటెంట్‌న నేను ఫాలో అయ్యేవాడ్ని : ఆనంద్ దేవరకొండ

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ ట్రైలర్ రిలీజ్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ కేరళ షెడ్యూల్ కంప్లీట్, దీపావళికి రెడీ

Nani: ఆర్ఎఫ్సీలో ది పారడైజ్ కోసం నాని భారీ యాక్షన్ సీక్వెన్స్

నలందా విశ్వవిద్యాలయం బ్యాక్‌గ్రౌండ్‌లో స్ఫూర్తి నింపే గేమ్‌ అఫ్‌ చేంజ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

తర్వాతి కథనం
Show comments