Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎయిర్ ఇండియా ఫ్లైట్‌ను ఢీకొట్టిన ఇండిగో విమానం... పైలెట్లపై చర్య

వరుణ్
గురువారం, 28 మార్చి 2024 (09:22 IST)
కోల్‌కతా విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. రెండు విమానాలు ఢీకొన్నాయి. పార్కింగ్ చేసివున్న ఎయిర్ ఇండియా విమానాన్ని ఇండిగో విమానం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎయిర్ ఇండియా విమానం ఫ్లైట్ రెక్కలను తగులుతూ ఇండిగో విమానం వెళ్లింది. దీంతో ఎయిర్ ఇండియా విమానం రెక్క విరిగిపోయింది. ఈ ఘటనపై డీజీసీఏ ఆగ్రహం వ్యక్తం చేస్తూ విచారణకు ఆదేశించింది. అలాగే, ఈ ఘటనకు బాధ్యులైన ఇండిగో పైలెట్లను విధులకు దూరం చేసింది. 
 
చెన్నై వెళ్ళాల్సిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్‌ క్లియరెన్స్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఇండిగో విమానం ఒకటి వచ్చి ఢీకొట్టింది. ఈ విమానం అపుడే ల్యాండింగ్ అయి పార్కింగ్ కోసం వస్తున్న సమయంలో ఎయిర్ విమానం రెక్కలను తగులుతూ వెళ్లిందని ఎయిర్ ఇండియా సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ ఘటన తర్వాత విమానానికి అదనపు తనిఖీలు నిర్వహించామని, ప్రస్తుతం ఘటనపై దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. డీజీసీఏ, ఎయిర్‌పోర్టు అధికారులతో ఈ విషయమై నిరంతరం టచ్‌లో ఉన్నట్టు చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharva: శర్వా, సంయుక్త పై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్

నెలకు 67 రూపాయల ప్యాక్ తో ఖర్చు తక్కువ కిక్ ఎక్కువ అంటున్న ఆహా ఓటీటీ

Balayya: ఎనిమిది నెలలు నిద్రాహారాలు మాని కృషి చేసి సినిమాని రీస్టోర్ చేశారు : బాలకృష్ణ

Kadambari: వ‌దిలేసిన నిస్సాహ‌యుల‌ను మేం చేరదీస్తాం : మనం సైతం కాదంబరి

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments