Webdunia - Bharat's app for daily news and videos

Install App

లోక్ సభ ఎన్నికలు 2019, అమెరికాను మించిపోతున్న భారత్... ఏ విషయంలో?

Webdunia
మంగళవారం, 12 మార్చి 2019 (16:41 IST)
భారతదేశంలో ఎన్నికలు జరిగే సమయంలో డబ్బు ప్రవాహంలా ఉంటుందనే విషయం బహిరంగ సత్యం. అభ్యర్థులు ప్రకటించే ఖర్చులకు చేసే ఖర్చులకు పొంతనే ఉండదు. అయితే ఈ సారి జరగబోయే ఎన్నికల్లో చేయబోయే వ్యయం సరికొత్త ప్రపంచ రికార్డును సాధిస్తుందట. భారతదేశంలో ఏప్రిల్ 11 నుండి మే 19 వరకు ఆరు వారాల వ్యవధిలో సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియ జరగనుంది.
 
ఈసారి జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో దాదాపు 50 వేల కోట్ల రూపాయలు (7 బిలియన్ డాలర్లు) ఖర్చు కానున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ఢిల్లీ కేంద్రంగా పనిచేసే సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ ప్రకటించింది. అయితే ఈ మొత్తం 2014 ఎన్నికల ఖర్చు కంటే 40 శాతం ఎక్కువగా ఉన్నట్లు సిఎమ్ఎస్ పేర్కొన్నది. 2016లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో 6.5 బిలియన్ డాలర్లు ఖర్చు కాగా, భారతదేశంలో 2019 ఎన్నికల ఖర్చు దాని కంటే 50 కోట్ల రూపాయలు ఎక్కువగా ఉండబోతోందని పేర్కొన్నది.
 
అదేవిధంగా ఇండియాలో 2014 ఎన్నికల్లో సోషల్ మీడియా ఖర్చు రూ. 250 కోట్లుగా ఉండగా ఈ ఎన్నికల్లో దాదాపు 5 వేల కోట్లకు చేరుకున్నట్లు సమాచారం. పార్టీలు పెట్టే ఖర్చులో అత్యధిక భాగం ప్రకటనలు, ప్రయాణ ఖర్చులు, సోషల్ మీడియా ఖర్చులే ఎక్కువగా ఉంటున్నట్లు సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పోలీసులు అరెస్టు చేయలేదు : మంచు మనోజ్

పవన్ ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్చిన నిర్మాత ఏఎం రత్నం.. ఏంటది?

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments