Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైలు టిక్కెట్ కౌంటర్ల వద్ద క్యూ లైన్లకు ముగింపు.. ఎలా?

ఠాగూర్
బుధవారం, 2 జులై 2025 (08:17 IST)
రైలు ప్రయాణికులకు భారతీయ రైల్వే శుభవార్త చెప్పింది. ఇప్పటివరకు వివిధ రకాలైన సేవల కోసం వేర్వేరు యాప్‌లను ఉపయోగించాల్సిన అవసరాన్ని తొలగిస్తూ, అన్ని సేవలను ఒకే గొడుగు కిందకు తెచ్చింది. రైల్ వన్ యాప్ పేరుతో సరికొత్త ఆన్ ఇన్ వన్ సూపర్ యాప్‌ను కేంద్ర రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ ఆవిష్కరించారు. సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ 40వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ యాప్‌ను ప్రయాణికులకు అంకితం చేశారు. ఈ యాప్ ద్వారా ప్రయాణం మరింత సులభతరం కానుంది. ముఖ్యంగా, రైలు ప్రయాణ టిక్కెట్లు జారీచేసే కౌంటర్ల వద్ద క్యూ లైన్ల సమస్యకు ముగింపు పలకవచ్చని రైల్వే శాఖ విశ్వాసం వ్యక్తం చేసింది. 
 
రైల్ వన్ యాప్‌ ప్రయాణికులకు సమగ్రమైన సేవలను అదిస్తుంది. ముఖ్యంగా, కౌంటర్ల వద్ద మాత్రమే లభించే అన్‌రిజర్వుడ్ టిక్కెట్లను ఇపుడు ఈ యాప్ ద్వారా సులుపుగా బుక్ చేసుకోవచ్చు. గతంలో ఉన్న యూటీఎస్‌ యూప్‌ను మరింత సరళీకరించి, ఈ కొత్త యాప్‌లో అనుసంధానించారు. దీంతో పాటు ఫ్లాట్‌ఫామ్ టిక్కెట్లను కూడా కొనుగోలు చేయవచ్చు. ఐఆర్‌సీటీసీ ద్వారా జరిగే రిజర్వుడ్ టిక్కెట్ల బుకింగ్ యథాతథంగా కొనసాగుతుందని, క్రిస్, ఐఆర్‌సీటీసీ భాగస్వాములుగా పని చేస్తాయని మంత్రి స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

పట్టణంలో కొత్త రాబిన్‌హుడ్ వచ్చింది ఓటీటీలోకి హరి హర వీర మల్లు

Ramcharan: పెద్ది లో కొత్త లుక్ లో రామ్ చరణ్ ను చూపించనున్న స్టైలిస్ట్ ఆలీం హకీం

బరాబర్ ప్రేమిస్తా’ నుంచి పాట విడుదల చేసిన బన్నీ వాస్

లిటిల్ హార్ట్స్ మూవీలో లైవ్ లీగా చూపించారు : అనిల్ రావిపూడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments