Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ పోరాడుతుంది.. తిరిగి నవ్వుతుంది : ప్రధాని మోడీ

Webdunia
మంగళవారం, 7 ఏప్రియల్ 2020 (14:31 IST)
ప్రపంచాన్ని చుట్టేసిన కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు భారత్ శక్తికిమించి పోరాడుతోందని, భారత్ తిరిగి నవ్వుతుందని, ఈ మహమ్మారిపై భారత్ విజయం సాధిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ అభిప్రాయపడ్డారు. 
 
ఈ మేరకు ఆయన మంగళవారం ఓ ట్వీట్ చేశారు. దీనికి ఓ మ్యూజిక్ వీడియోను కూడా జతచేశాడు. "భారత్ తిరిగి నవ్వుతుంది, భారత్ మరోసారి విజయం సాధిస్తుంది. ఇండియా పోరాడుతుంది. గెలిచి తీరుతుంది" అంటూ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ ట్వీట్ ఇపుడు ట్విట్టర్‌లో వైరల్ అయింది. 
 
అలాగే, మోడీ అటాచ్ చేసిన మ్యూజిక్ వీడియోలో బాలీవుడ్ తారలు ఆక్షయ్ కుమార్, ఆయుష్మాన్ ఖురానా, కార్తీక్ ఆర్యన్, తాప్సీ, అనన్యాపాండే తదితరులు ఇందులో నటించారు. సినీ కుటుంబం వేసిన మంచి అడుగు అని ఈ వీడియోను అభివర్ణించిన ప్రధాని, కరోనా వైరస్‌పై ప్రజల్లో మరింత అవగాహన పెంచుతోందని కితాబిచ్చారు. 
 
'ముస్కురాయేగా ఇండియా' పేరిట ఈ సాంగ్ విడుదలైంది. ఈ కష్టకాలంలో ప్రజలు సహకరిస్తే, భారతావని మరోమారు నవ్వుతుందన్న సందేశం ఇందులో ఉంది. మూడు నిమిషాల, 25 సెకన్లు ఉన్న ఈ వీడియో సోమవారం సాయంత్రం విడుదల కాగా, ఇప్పటికే ఆరు లక్షలకు పైగా వ్యూస్ సాధించడంతో వైరల్ అయింది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

తర్వాతి కథనం
Show comments