Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగ్లాదేశ్‌లోని భారతీయుల ప్రయోజనాలే ముఖ్యం : భారత్

ఠాగూర్
శుక్రవారం, 9 ఆగస్టు 2024 (09:17 IST)
బంగ్లాదేశ్‌లోని భారతీయుల ప్రయోజనాలే తమకు ముఖ్యమంత్రి, ఆ దేశంలో నివసిస్తున్న భారతీయ ప్రజల భద్రతపై సంబంధిత అధికారులతో మాట్లాడుతున్నట్టు భారత విదేశాంగ మంత్విత్వ శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లు అంశం పెను చిచ్చురేపింది. ఫలితంగా ఆ దేశ ప్రధానమంత్రి పదవికి షేక్ హసీనా రాజీనామా చేశారు. పైగా, ఆమె ఏకంగా దేశాన్ని వీడాల్సి వచ్చింది కూడా. ప్రస్తుతం ఆమె భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. 
 
మరోవైపు, బంగ్లాదేశ్‌లో హింసాత్మక సంఘటనలు చెలరేగాయి. ఆ దేశంలోని మైనార్టీ హిందువులపై దాడులు జరుగుతున్నాయి. హిందూ యువతులు, మహిళలపై బంగ్లా పౌరులు అత్యాచారాలు, అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. బంగ్లాలోని హిందూ దేవాలయాలను ధ్వంసం చేస్తున్నారు. ఈ పరిణామాలన్నింటినీ భారత విదేశాంగ శాఖ బేరీజు వేస్తుంది. ఈ తాజా పరిణామాలపై భారత విదేశాంగ శాఖ స్పందించింది.
 
బంగ్లాదేశ్ ప్రజల ప్రయోజనాలే భారత్‌కు ముఖ్యమని వెల్లడించింది. బంగ్లాదేశ్‌లో మైనారిటీ వర్గాలపై దాడుల ఘటనలను గమనిస్తున్నామని తెలిపింది. బంగ్లాదేశ్‌లోని భారతీయుల భద్రతపై అధికారులను సంప్రదిస్తున్నామని విదేశాంగ శాఖ పేర్కొంది. పొరుగుదేశంలో శాంతిభద్రతల పునరుద్ధరణ త్వరగా జరగాలని ఆశిస్తున్నామని తెలిపింది. బంగ్లాదేశ్‌లో ఇప్పటికీ ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయని, ఇది ఆందోళన కలిగించే అంశమని వెల్లడించింది. ఇక, ప్రధాని పదవికి రాజీనామా చేసి ఢాకా నుంచి భారత్ వచ్చిన షేక్ హసీనా ఎప్పుడు భారత్‌ను వీడుతారనేది చెప్పలేమని, షేక్ హసీనా భవిష్యత్ ప్రణాళిక గురించి తెలియదని విదేశాంగ శాఖ వివరించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ బ్యాలెన్స్ అవేర్‌నెస్ వీక్‌లో వెర్టిగో చక్కర్ అంటే ఏమిటో తెలుసుకుందాం

అధిక రక్తపోటు వున్నవారు దూరం పెట్టాల్సిన పదార్థాలు

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

తర్వాతి కథనం
Show comments