Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'కుస్తీ నాపై గెలిచింది. నేను ఓడిపోయాను...' - వినేశ్ ఫొగాట్ సంచలన నిర్ణయం

vinesh phogat

ఠాగూర్

, గురువారం, 8 ఆగస్టు 2024 (09:18 IST)
భారత రెజ్లర్‌ వినేశ్ ఫొగాట్ సంచలన నిర్ణయం తీసుకుంది. రెజ్లింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది. "కుస్తీ నాపై గెలిచింది.... నేను ఓడిపోయాను.. నన్ను క్షమించు... మీ కల.. నా ధైర్య విచ్ఛిన్నమైంది. ఇక నాకు ఇంకా పోరాడే బలం లేదు. మీ అందరికీ రుణపడి ఉంటాను" అంటూ ఎక్స్ వేదికగా తన నిర్ణయాన్ని ప్రకటించింది. ఆమె నిర్ణయం ప్రతి ఒక్కరినీ షాక్‌కు గురిచేసింది.
 
అద్వితీయ ప్రదర్శనతో పారిస్ ఒలింపిక్స్ రెజ్లింగ్ ఫైనల్లోకి దూసుకెళ్లి, ఆ ఘనత సాధించిన తొలి భారత రెజ్లర్‌కు చరిత్ర సృష్టించిన వినేశ్ ఫోగాట్ దేశానికి మరో పతకం ఖరారు చేసిందని భారత్ సంబరాలు చేసుకుంటుండగానే చేదువార్త వినాల్సి వచ్చింది.
 
ఉండాల్సిన బరువు కంటే 100 గ్రాములు అధికంగా ఉందన్న కారణంతో ఆమెను అనర్హురాలిగా తేల్చడంతో దేశం యావత్తు నిర్ఘాంతపోయింది. తనను అనర్హురాలిగా ప్రకటించడంపై వినేశ్ 'కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్'ను ఆశ్రయించింది. తాను రజత పతకానికి అర్హురాలినని ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై తీర్పు రావడానికి ముందే వినేశ్ రిటైర్మెంట్ ప్రకటించి కోట్లమంది భారతీయుల హృదయాలను బరువెక్కించింది. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాత్రికి రాత్రి వినేశ్ బరువు పెరిగిపోయింది.. ఇందులో ఆమె తప్పు లేదు : భారత రెజ్లింగ్ సమాఖ్య