Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాశ్మీర్ విషయంలో అమెరికా జోక్యమా.. నో ఛాన్స్: భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ

భారత్-పాకిస్థాన్‌ల మధ్య సమస్యల పరిష్కారంలో అమెరికా చీఫ్ డొనాల్డ్ ట్రంప్ పాలుపంచుకునే అవకాశం ఉందని అమెరికా తరుపున ఐక్యరాజ్యసమితి శాశ్వత రాయబారి నిక్కీహాలే తెలిపారు. దీనిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స

Webdunia
బుధవారం, 5 ఏప్రియల్ 2017 (09:26 IST)
భారత్-పాకిస్థాన్‌ల మధ్య సమస్యల పరిష్కారంలో అమెరికా చీఫ్ డొనాల్డ్ ట్రంప్ పాలుపంచుకునే అవకాశం ఉందని అమెరికా తరుపున ఐక్యరాజ్యసమితి శాశ్వత రాయబారి నిక్కీహాలే తెలిపారు. దీనిపై ప్రధాన మంత్రి  నరేంద్ర మోడీ స్పందిస్తూ అమెరికాకు ఝలక్ ఇచ్చారు. భారతదేశం ప్రారంభం నుంచి విదేశీ వ్యవహారాల్లో తనకంటూ ఓ పద్ధతిని అవలంబిస్తోంది. జవహర్ లాల్ నెహ్రూ కాలం నుంచి భారత్-పాక్‌ల మధ్య సమస్యల పరిష్కారానికి మూడో దేశం జోక్యాన్ని.. చివరకు ఐక్యరాజ్య సమితి జోక్యాన్ని కూడా అంగీకరించడం లేదు. 
 
అదే భారత విదేశాంగ విధానం. అయితే భారత్-పాకిస్థాన్‌ల మధ్య స్పర్ధలు సవరించేందుకు అగ్రరాజ్యం అమెరికా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలియరాగానే.. భారత్ స్పందించింది. అమెరికా వివాదాస్పద అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాశ్మీర్ విషయంలో రంగంలోకి దిగి ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం రాగానే.. భారత్ ఎన్నటికీ తృతీయ దేశం జోక్యాన్ని సహించదు.
 
ఇంకా భారత్- పాకిస్థాన్‌ల మధ్య నెలకొన్న వివాదాలను రెండు దేశాలే పరిష్కరించు కోవాలన్న విధానానికే కట్టుబడి ఉన్నామని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటనలో పేర్కొంది. తద్వారా మూడో దేశ ప్రమేయాన్ని మరోసారి నిర్ద్వంద్వంగా భారత్ తిరస్కరించింది. ఈ ప్రకటన ప్రధాని మోడీ ఆదేశాల మేరక విడుదలైనట్లు సమాచారం.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments