Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిరియాలో మారణహోమం.. రసాయనిక దాడి.. 100 మంది చిన్నారుల మృత్యువాత

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల కేంద్రంగా ఉన్న సిరియాలో మారణహోమం సాగుతోంది. రెబెల్స్ ప్రాబల్యం అధికంగా ఉన్న ఇడ్లిబ్ నగరంలో మంగళవారం రసాయన దాడి జరిగింది. ఈ దాడిలో వందలాది మంది చిన్నారులు మృత్యువాతపడ్డారు.

Webdunia
బుధవారం, 5 ఏప్రియల్ 2017 (09:12 IST)
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల కేంద్రంగా ఉన్న సిరియాలో మారణహోమం సాగుతోంది. రెబెల్స్ ప్రాబల్యం అధికంగా ఉన్న ఇడ్లిబ్ నగరంలో మంగళవారం రసాయన దాడి జరిగింది. ఈ దాడిలో వందలాది మంది చిన్నారులు మృత్యువాతపడ్డారు. మరో 400 మంది శ్వాసకోస ఇబ్బందులతో బాధపడుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సిరియా మెడికల్ రిలీఫ్ గ్రూప్ పేర్కొంది.
 
రసాయన దాడి తర్వాత చిన్నారులు నేలపైపడి గిలగిలా కొట్టుకుంటున్న దృశ్యాలను మీడియా ప్రసారం చేయడంతో ప్రపంచ దేశాలు సైతం ఉలిక్కిపడ్డాయి. ఈ చర్యను అంతర్జాతీయ సమాజం తీవ్రంగా తప్పుబట్టింది. ఉగ్రవాదులను అణచివేసే పద్ధతి ఇది కాదంటూ మండిపడ్డాయి. 
 
దీంతో స్పందించిన సిరియా రసాయన దాడి వార్త అవాస్తవమని, తాము రసాయన ఆయుధాలను ఉపయోగించలేదని, భవిష్యత్తులోనూ వాటిని ఉపయోగించే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. 
 
మరోవైపు సిరియా సైన్యమే ఈ దాడికి పాల్పడిందని బ్రిటన్ కేంద్రంగా పనిచేస్తున్న సిరియా మానవ హక్కుల సంఘం ఆరోపించింది. దాడిలో పలువురు చిన్నారులు సహా కనీసం వందమంది ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments