Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిరియాలో మారణహోమం.. రసాయనిక దాడి.. 100 మంది చిన్నారుల మృత్యువాత

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల కేంద్రంగా ఉన్న సిరియాలో మారణహోమం సాగుతోంది. రెబెల్స్ ప్రాబల్యం అధికంగా ఉన్న ఇడ్లిబ్ నగరంలో మంగళవారం రసాయన దాడి జరిగింది. ఈ దాడిలో వందలాది మంది చిన్నారులు మృత్యువాతపడ్డారు.

Webdunia
బుధవారం, 5 ఏప్రియల్ 2017 (09:12 IST)
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల కేంద్రంగా ఉన్న సిరియాలో మారణహోమం సాగుతోంది. రెబెల్స్ ప్రాబల్యం అధికంగా ఉన్న ఇడ్లిబ్ నగరంలో మంగళవారం రసాయన దాడి జరిగింది. ఈ దాడిలో వందలాది మంది చిన్నారులు మృత్యువాతపడ్డారు. మరో 400 మంది శ్వాసకోస ఇబ్బందులతో బాధపడుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సిరియా మెడికల్ రిలీఫ్ గ్రూప్ పేర్కొంది.
 
రసాయన దాడి తర్వాత చిన్నారులు నేలపైపడి గిలగిలా కొట్టుకుంటున్న దృశ్యాలను మీడియా ప్రసారం చేయడంతో ప్రపంచ దేశాలు సైతం ఉలిక్కిపడ్డాయి. ఈ చర్యను అంతర్జాతీయ సమాజం తీవ్రంగా తప్పుబట్టింది. ఉగ్రవాదులను అణచివేసే పద్ధతి ఇది కాదంటూ మండిపడ్డాయి. 
 
దీంతో స్పందించిన సిరియా రసాయన దాడి వార్త అవాస్తవమని, తాము రసాయన ఆయుధాలను ఉపయోగించలేదని, భవిష్యత్తులోనూ వాటిని ఉపయోగించే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. 
 
మరోవైపు సిరియా సైన్యమే ఈ దాడికి పాల్పడిందని బ్రిటన్ కేంద్రంగా పనిచేస్తున్న సిరియా మానవ హక్కుల సంఘం ఆరోపించింది. దాడిలో పలువురు చిన్నారులు సహా కనీసం వందమంది ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ ఫస్ట్ లుక్

Bhatti Vikramarka: కన్నప్ప మైల్ స్టోన్ చిత్రం అవుతుంది: మల్లు భట్టి విక్రమార్క

రైతుల నేపథ్యంతో సందేశం ఇచ్చిన వీడే మన వారసుడు మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments