Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్, పాకిస్థాన్‌‌ల మధ్య కీలక ఒప్పందం.. కాల్పులు ఆగుతాయా?

Webdunia
గురువారం, 25 ఫిబ్రవరి 2021 (21:29 IST)
భారత్, పాకిస్థాన్‌‌ల మధ్య కీలక ఒప్పందం కుదిరింది. నియంత్రణ రేఖ వద్ద కాల్పులకు పాల్పడకూడదని భారత్, పాకిస్థాన్‌లు ఒక ఒప్పందానికి వచ్చాయి. జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో క్రాస్ బోర్డర్ ఫైరింగ్ పెద్ద ఎత్తున జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనికి ముగింపు పలకాలనే యోచనలో ఇరు దేశాల అత్యున్నత మిలిటరీ అధికారుల మధ్య చర్చలు జరిగాయి. ఈ చర్చలల్లో ఇరు దేశాలు ఈ నిర్ణయానికి వచ్చాయి.
 
చర్చల అనంతరం ఇరు దేశాలు సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. వాస్తవానికి ఇండియా, పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం 2003లోనే కుదిరింది. అయినప్పటికీ, పాక్ ఆ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ, పాక్ నిరంతరం కాల్పులకు తెగబడుతోంది. 
 
పాక్ కాల్పుల వల్ల సరిహద్దుల్లో ఉన్న గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఏదేమైనప్పటికీ.. తాజా ఒప్పందం వల్ల పాక్ లో కొంచమైనా మార్పు వస్తుందని భావిస్తున్నట్టు ఇండియన్ ఆర్మీకి చెందిన ఒక అధికారి తెలిపారు. పాక్‌లో మార్పు వస్తే సరిహద్దుల్లో శాంతి నెలకొంటుందని ఆయన చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

Dhanush: పవన్ కళ్యాణ్ సినిమానే ధనుష్ ఎందుకు డైరెక్ట్ చేస్తానన్నాడు?

జార్జియా నుంచి అఖండ 2: తాండవం తాజాగా ఆర్‌ఎఫ్‌సీలో షూటింగ్

Uppu Kappurambu: జూలై 14న ప్రైమ్ వీడియోలో కీర్తి సురేష్ ఉప్పు కప్పురంబు

దంగల్ హీరోయిన్ ఫాతిమా సనా షేక్ స్టేజిపైన ఏం చేసిందో తెలుసా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments