Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చరిత్ర సృష్టించిన అశ్విన్... 400 వికెట్ల క్లబ్‌లో చోటు

చరిత్ర సృష్టించిన అశ్విన్... 400 వికెట్ల క్లబ్‌లో చోటు
, గురువారం, 25 ఫిబ్రవరి 2021 (19:30 IST)
భారత స్పిన్నర్ రవిచంద్రన్ రవిచంద్రన్ అశ్విన్ చరిత్ర సృష్టించాడు. అత్యంత వేగంగా 400 వికెట్లు సాధించిన బౌలర్‌గా రికార్డు నమోదు చేశాడు. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో జోఫ్రా ఆర్చర్ వికెట్ తీయడంతో అశ్విన్ టెస్టుల్లో 400వ వికెట్ ఖాతాలో వేసుకున్నాడు. అశ్విన్ కేవలం 77 టెస్టుల్లోనే ఈ మైలురాయి అందుకున్నాడు.
 
కాగా, అహ్మదాబాద్‌ వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ టెస్టులో వికెట్ల పండగ నెలకొంది. స్పిన్నర్లకు ఇక్కడి పిచ్ స్వర్గధామంలా మారడంతో వికెట్లు టపటపా నేలరాలిపోయాయి. 
 
ఫలితంగా ఈ మ్యాచ్ ద్వారా టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనత సాధించాడు. అత్యంత వేగంగా 400 వికెట్లు సాధించిన భారత బౌలర్‌గా రికార్డు నమోదు చేశాడు. 
 
వేగంగా 400 టెస్టు వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ మొదటి స్థానంలో ఉన్నాడు. మురళీధరన్ 72 టెస్టుల్లోనే 400 మార్కు అందుకున్నాడు. 
 
ఇప్పటిదాకా భారత్‌లో 400 పైచిలుకు వికెట్లు తీసింది అనిల్ కుంబ్లే (619), కపిల్ దేవ్ (434), హర్భజన్ సింగ్ (417) మాత్రమే. ఇప్పుడు అశ్విన్ కూడా వీరి సరసన చేరాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మలుపులు తిరుగుతున్న మోతేరా టెస్ట్ : 145 రన్స్‌కు భారత్ ఆలౌట్