Webdunia - Bharat's app for daily news and videos

Install App

గత మూడేళ్లలో 329 పులులు మృత్యువాత : కేంద్రం

Webdunia
మంగళవారం, 26 జులై 2022 (15:50 IST)
దేశ వ్యాప్తంగా గత మూడేళ్ల కాలంలో 329కి పైగా పులులు మృతి చెందినట్టు కేంద్రం తెలిపింది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా, మంగళవారం లోక్‌సభలో పర్యావరణ శాఖ సహాయ మంత్రి అశ్వినీ కుమార్ చౌబే ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఇందులో గత మూడేళ్ళ కాలంలో మొత్తం 329 పులులు చనిపోయాయని తెలిపారు. 
 
గత 2019లో 96 పులులు, 2020లో 106, 2021లో 127 చొప్పున ప్రాణాలు కోల్పోయినట్టు తెలిపారు. వీటిలో ప్రకృతి విపత్తుల కారణంగా 69, ఇతర కారణాల వల్ల 35, వేటాడటం వల్ల 29 చనిపోయినట్టు ఆయన వెల్లడించారు. మిగిలిన 197 పులుల మృతిపై విచారణ జరుగుతుందని చెప్పారు. 
 
ప్రధానంగా గత 2019 కంటే 2021లో పులుల వేట గణనీయంగా తగ్గిందన్నారు. పులుల వేట సాగించే సమయంలో 125 మంది వేటగాళ్లు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. అలాగే, గత మూడేళ్లలో 307 ఏనుగులు విద్యుదాఘాతం, రైలు ప్రమాదాలు, అనారోగ్యం, వేటాడటం వల్ల చనిపోయాయని వివరించారు. 
 
వీటిలో 222 ఏనుగులు విద్యుదాఘాతానికి చనిపోగా, వీటిలో ఎక్కువగా ఒరిస్సా రాష్ట్రంలోనే 41, తమిళనాడులో 34, అస్సాంలో 33 చొప్పున ఏనుగులు మృత్యువాతపడ్డాయని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రెండోసారి తల్లి అయిన గోవా బ్యూటీ...

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments