Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీని ఓడించాలంటే కేజ్రీవాల్‌కు మద్దతుగా నిలవాలి : శరద్ పవార్

ఠాగూర్
బుధవారం, 15 జనవరి 2025 (13:33 IST)
ఢిల్లీ అసెంబ్లీకి జరుగనున్న ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఓడించాలంటే ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్‌కు బీజేపీయేతర పార్టీలు మద్దతుగా నిలవాలని కేంద్ర మాజీ మంత్రి, వృద్ధ రాజకీయ నేత, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల కోసం ఆప్ పార్టీతో కాంగ్రెస్ పార్టీలు కలిసి పనిచేయడం లేదు. దీనిపై శరద్ పవార్ స్పందించారు. ఢిఎన్నికల్లో ఇండియా కూటమిలోని పార్టీలన్నీ కేజీవాల్ కు మద్దతుగా నిలవాలని ఆయన కోరారు.
 
ఇండియా కూటమి జాతీయ స్థాయిలో మాత్రమే కలసికట్టుగా పని చేస్తోందని... రాష్ట్రాల ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల గురించి ఇప్పటివరకు చర్చ జరగలేదని శరద్ పవార్ తెలిపారు. మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలు ఒంటరిగా పోటీ చేయాలా? లేక కలసి పోటీ చేయాలా? అనేది చర్చల ద్వారా నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. రానున్న 8-10 రోజుల్లో కూటమి పార్టీల నేతలు సమావేశమై దీనిపై నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.
 
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్, ఆప్ పార్టీలు విడివిడిగా పోటీ చేస్తున్నాయి. పొత్తు పెట్టుకోకుండా ఎన్నికలకు వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజీపీ, కాంగ్రెస్, ఆప్ మధ్య త్రిముఖ పోరు నెలకొంది. ఇలాంటి పరిస్థితిలో శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేపుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని బాధ్యతగా తీసుకుంటా - విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments