Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు : మహా వికాస్ అఘాడీలో సీట్ల పంపిణీ

Advertiesment
maharashtra

ఠాగూర్

, గురువారం, 24 అక్టోబరు 2024 (09:22 IST)
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఆయా పార్టీలు ప్రకటిస్తున్నాయి. అయితే, శివసేన, కాంగ్రెస్ ఎన్సీపీ పార్టీలు కలిసి ఏర్పాటు చేసిన మహా వికాస్ అఘాడీ కూటమిలో కూడా సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కి వచ్చింది. మొత్తం 270 సీట్లు మహారాష్ట్ర అసెంబ్లీలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ పార్టీలు 85 చొప్పున పోటీ చేయాలని నిర్ణయించాయి. మిగిలిన 33 సీట్లను కూటమిలోని సమాజ్‌వాదీ పార్టీతో పాటు ఇతర చిన్నాచితక పార్టీలకు కేటాయించాలని ఎంవీఏ కూటమి నేతలు నిర్ణయించారు. 
 
సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయం కుదరక గత కొన్ని రోజులుగా ఏంవీఏ కూటమి నేతల మధ్య విభేదాలు పొడచూపిన విషయం తెల్సిందే. శివసేన ఠాక్రే వర్గానికి, కాంగ్రెస్ మధ్య చిన్నపాటి మాటల యుద్ధమే కొనసాగింది. విదర్భలో కాంగ్రెస్ నుంచి ఠార్గే వర్గం మరో ఎనిమిది సీట్లకు పట్టుబట్టింది. 
 
మొత్తంగా మహారాష్ట్రలో 17 సీట్లను కాంగ్రెస్ పార్టీ నుంచి కోరడంతో సీట్ల పంపిణీతో ప్రతిష్టంభన నెలకొంది. అయితే, తాజాగా తీసుకున్న నిర్ణయంతో సీట్ల సర్దుబాటు వివాదానికి తెరపడినట్టయింది. ఇదిలావుంటే, శివసేన పార్టీ ఇప్పటికే 65 మందితో కూడిన తొలి జాబితాను ప్రకటించిన విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక హోదా పునరుద్ధరించండి... అమిత్‌ షాకు ఒమర్ అబ్దుల్లా వినతి