Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ రాష్ట్రంలో పెరిగిపోతున్న పేడ దొంగలు.. తలలు పట్టుకుంటున్న ఖాకీలు

Webdunia
మంగళవారం, 2 మార్చి 2021 (10:07 IST)
సాధారణంగా ఇంటి దొంగలు, ముసుగు దొంగలు, దోపిడీ దొంగలు ఇలాంటి వారిని చూసివుంటారు. కానీ, ఆ రాష్ట్రంలో మాత్రం పేడ దొంగలు ఉన్నారు. ఈ పేడ దొంగల వ్యవహారం పోలీసులకు తలనొప్పిగా మారింది. దీంతో ఈ పేడ దొంగలను పట్టుకునేందుకు ఏకంగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, చత్తీస్‌గఢ్ ప్రభుత్వం 2020లో గౌ-దాన్ న్యాయ యోజన పథకాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా కిలో ఆవు పేడను రెండు రూపాయలకు కొనుగోలు చేస్తామని ప్రకటించింది. ప్రభుత్వ ప్రకటన తర్వాత పేడకు ఎక్కడలేని డిమాండ్ వచ్చేసింది.
 
పేడకు డిమాండ్ పెరగడంతో దొంగతనాలు కూడా అంతేస్థాయిలో పెరిగాయి. దీంతో పేడను కాపాడుకోవడానికి ఎవరికివారు సీసీటీవీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. 
 
తాజాగా, అంబికాపూర్ మునిసిపాలిటీలో ప్రభుత్వం గౌ-దాన్ కేంద్రం నుంచి ఆవు పేడను దొంగిలిస్తూ ఐదుగురు మహిళలు పట్టుబడ్డారు. వారి నుంచి 45 కేజీల పేడను స్వాధీనం చేసుకున్నారు. 
 
పెరిగిపోతున్న పేడ దొంగతనాలను అరికట్టేందుకు అధికారులు గౌ-దాన్ కేంద్రం వద్ద సీసీ కెమెరాల ఏర్పాటుకు అధికారులు రెడీ అవుతున్నారు. అంతేకాదు, పేడను కాపాడేందుకు అక్కడ సెక్యూరిటీ గార్డులను కాపలా కూడా పెట్టాలని నిర్ణయించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments