Webdunia - Bharat's app for daily news and videos

Install App

వచ్చే ఐదు రోజులు ఎండలు మండిపోతాయ్.. ఐఎండీ హెచ్చరిక

Webdunia
శుక్రవారం, 24 ఫిబ్రవరి 2023 (09:15 IST)
వచ్చే ఐదు రోజుల పాటు ఎండలు మండిపోతాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే ఫిబ్రవరి నెలలో పగటిపూట ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఈ ఎండల తీవ్రతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఐఎండీ పిడుగులాంటి వార్తను వెల్లడించింది. వచ్చే ఐదు రోజుల పాటు ఎండలు మండిపోతాయని హెచ్చరించింది. వాయువ్య, మధ్య, తూర్పు భారతదేశంలో సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ గురువారం తెలిపింది. 
 
దేశంలోని చాలా ప్రాంతాల్లో ఇప్పటికే అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. సాధారణంగా ఎండలు మార్చి మొదటి వారంలో ప్రారంభమవుతాయి. కానీ ఈసారి ముందుగానే ఎండలు మొదలయ్యాయని తెలిపింది. దీన్ని బట్టి చూస్తే ఈసారి ఎండలు ఎక్కువగానే ఉండే అవకాశాలున్నాయని హెచ్చరించింది. 
 
అయితే, వచ్చే రెండు రోజుల్లో వాయువ్య భారతదేశంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు లేదని వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత 2 నుంచి 3డిగ్రీల సెల్సియస్‌ వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. మార్చి మొదటి వారంలో వాయువ్య భారతదేశంలోని పలు ప్రాంతాల్లో 40 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు పెరగవచ్చని వాతావరణశాఖ అధికారులు తెలిపారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: అల్లు అర్జున్ సినిమా కోసం రెక్కీ చేస్తున్న దర్శకుడు అట్లీ

4 రోజుల్లో 15.41 కోట్ల గ్రాస్ వసూళ్లు దక్కించుకున్న లిటిల్ హార్ట్స్

Siddhu: సిద్ధు జొన్నలగడ్డ, శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా తెలుసు కదా విడుదల తేదీ ఫిక్స్

గత ఏడాది డిసప్పాయింట్ చేసింది, విఎఫ్ఎక్స్ ఇన్ హౌస్ లో చేయడంతో కంట్రోల్ వుంది : టిజి విశ్వప్రసాద్

Roshan: రోషన్ ఛాంపియన్‌లో మలయాళ నటి అనస్వర రాజన్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టొమాటో సూప్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

మీరు మద్యం సేవిస్తున్నారా? అయితే, ఈ ఫుడ్ తీసుకోవద్దు

ఫిలడెల్ఫియా నాట్స్ అక్షయపాత్ర ఆధ్వర్యంలో గణేశ్ మహా ప్రసాదం

పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

తర్వాతి కథనం
Show comments