Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు గన్నవరం టీడీపీ కార్యాలయానికి పార్టీ చీఫ్ చంద్రబాబు

Webdunia
శుక్రవారం, 24 ఫిబ్రవరి 2023 (08:54 IST)
గన్నవరం వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు దాడి చేసిన తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం సందర్శించనున్నారు. వల్లభనేని అనుచరులు, టీడీపీ శ్రేణుల మధ్య తీవ్రస్థాయిలో జరిగిన ఘర్షణలో ఈ కార్యాలయం పూర్తిగా ధ్వంసమైంది. ఆఫీసు ప్రాంగణంలోని కార్లకు నిప్పు అంటించారు. 
 
వైకాపా కార్యకర్తల దాడిలో ధ్వంసమైన కార్యాలయాన్ని ఆయన పరిశీలించనన్నారు. అలాగే పోలీసులు అరెస్టు చేసిన టీడీపీ నేత దొంతు చిన్నా కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. కాగా, గన్నవరం ఘటనపై చంద్రబాబు ఇప్పటికే బహిరంగ లేఖ ద్వారా వైకాపా ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన విషయం తెల్సిందే 
 
ఈ నెల 20వ తేదీన జరిగిన దాడిలో గన్నవరం టీడీపీ కార్యాలయంలోని ఫర్నిచర్ ధ్వంసం కావడంతో పాటు ఆవరణలో ఉన్న కారుకు నిప్పు అంటించారు. దీంతో కారు పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటన నేపథ్యంలో టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్, దొంతు చిన్నా తదితరులను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరచగా న్యాయమూర్తి రిమాండ్‌ విధించిన విషయం తెల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Suchitra: షణ్ముగరాజ్‌పై ఆరోపణలు చేసిన సుచిత్ర.. అన్నీ లాగేసుకున్నాడు.. ఇన్‌స్టాలో వీడియో (video)

Lakshmi Menon: బార్‌లో గొడవ- ఐటీ ఉద్యోగినిపై దాడి, కిడ్నాప్.. అజ్ఞాతంలో లక్ష్మీ మీనన్ (video)

Suvvi Suvvi: ట్రెండింగ్‌లో పవన్ కల్యాణ్ ఓజీ రొమాంటిక్ సాంగ్ సువ్వి సువ్వి (video)

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

Sreeleela: జూనియర్ ఎన్టీఆర్‌ను చూసి ముచ్చటపడిన శ్రీలీల తల్లి స్వర్ణలత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments