Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీహెచ్ఎంసీ ఉందా? లేదా? కుక్కలదాడి ఘటనపై హైకోర్టు ప్రశ్నలు

streetdogs
Webdunia
శుక్రవారం, 24 ఫిబ్రవరి 2023 (08:17 IST)
ఇటీవల హైదరాబాద్ నగరంలో వీధి కుక్కల దాడిలో ఐదేళ్ల బాలుడు మృత్యువాతపడగా, దీనిపై పత్రికల్లో వచ్చిన వార్తా కథనాల ఆధారంగా తెలంగాణ హైకోర్టు సుమోటాగా స్వీకరించింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, గ్రేటర్ హైదరాబాద్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్‍ కమిషనర్‌లకు నోటీసులు జారీచేసింది. హైదరాబాద్ నగరంలో కుక్కల బెడద పెరిగిపోతుంటే జీహెచ్ఎంసీ ఏం చేస్తుందని, అస్సలు ఉందా లేదా అని నిలదీసింది. మరోవైపు, వీధి కుక్కల బెడద, కుక్కకాటు నివారణ కోసం పురపాలక శాఖ కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. 
 
హైదరాబాద్ నగరంలోని అంబర్‌పేటలో ఆదివారం కుక్కల దాడిలో ఐదేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. ఈ కేసును హైకోర్టు సుమోటాగా స్వీకరించింది. వీధి కుక్కలు అంశంలో జీహెచ్ఎంసీ అధికారులు ఏం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. 
 
ఈ ఉదంతంలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుందన్నారు. వివరణ ఇవ్వాలంటా జీహెచ్ఎంసీ, సీఎస్, అంబర్‍పేట్ మున్సిపల్ అధికారి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌ను హైకోర్టు నోటీసు జారీచేసింది. అలాగే, బాలుడి మృతి బాధాకరమని, నష్ట పరిహారం అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచన చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments