Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడితో చాటింగ్... భర్త తన వాట్స్ యాప్ చూసాడని నరికేసింది...

భార్యాభర్తల సంబంధాలు రానురాను దారుణంగా మారిపోతున్నాయా అనిపిస్తోంది. ఎంతమాత్రం ఒకరిపై ఒకరికి విశ్వాసం లేకపోవడం, వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం, తేడా వస్తే ఒకరిని ఇంకొకరు చంపుకోవడం జరుగుతోంది. తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది.

Webdunia
మంగళవారం, 13 జూన్ 2017 (13:06 IST)
భార్యాభర్తల సంబంధాలు రానురాను దారుణంగా మారిపోతున్నాయా అనిపిస్తోంది. ఎంతమాత్రం ఒకరిపై ఒకరికి విశ్వాసం లేకపోవడం, వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం, తేడా వస్తే ఒకరిని ఇంకొకరు చంపుకోవడం జరుగుతోంది. తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. 
 
వివరాలను చూస్తే.... బేరాఘర్ లోని ఖిలావలి గ్రామంలో నేత్రాపాల్, నీతూసింగ్ దంపతులున్నారు. వీరికి 2014లో వివాహం అయ్యింది. కానీ నీతూసింగుకు ఆల్రెడీ మరో అబ్బాయితో ఎఫైర్ వుంది. ఈ సంగతి తెలిసి భర్త నిలదీస్తే... అతడితో గొడవకు దిగింది. దాంతో చేసేది లేక అతడు ఆమె నుంచి దూరంగా వుంటున్నాడు కానీ విడాకులు ఏమీ తీసుకోలేదు. తాజాగా ఓ ఫ్యామిలీ వేడుకకు ఇద్దరూ వచ్చారు. 
 
ఆ సమయంలో నీతూ సింగ్ తన ప్రియుడితో జోరుగా చాటింగ్ చేస్తూనే వుంది. దాంతో చిర్రెత్తుకొచ్చిన భర్త నేత్రాపాల్ ఆమె చాటింగ్ చేస్తున్న ఫోనును అడిగాడు. అందుకామె తిరస్కరించింది. దాంతో అతడు ఫోనును బలవంతంగా ఆమె దగ్గర్నుంచి లాగేసుకున్నాడు. వెంటనే వాట్స్ యాప్ లో భార్య తన ప్రియుడితో చేసిన చాటింగ్ చూస్తూ వున్నాడు. 
 
తన భర్త చేష్టలను భరించలేని ఆ ఇల్లాలు ఓ కత్తిని తీసుకుని అతడి తలపై బలంగా నరికింది. దాంతో అతడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత ఆమె అక్కడి నుంచి ప్రియుడిని తీసుకుని పారిపోయింది. తీవ్ర గాయాలపాలైన నేత్రాపాల్ ను బంధువులు ఆస్పత్రిలో చేర్పించారు. అతడికి ప్రాణాపాయం తప్పింది. ఆ తర్వాత నీతూసింగ్, ఆమె ప్రియుడి ఆచూకి తెలుసుకుని పట్టుకుని చితకబాదారు. పోలీసులకు అప్పగించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments