Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా సంతోషం కోసమే... రూ.228 కోట్లు విరాళంగా ఇచ్చా.. కృష్ణ చివుకుల

వరుణ్
బుధవారం, 7 ఆగస్టు 2024 (13:53 IST)
ఐఐటీ మద్రాస్‌ నుంచి వచ్చే ఇంజనీర్లకు అమెరికాలో మంచి పేరుతో పాటు గుర్తింపు ఉందని అది చూసి తాను ఎంతో గర్వపడుతుంటానని ఇండో ఎంఐఎం సీఈవో కృష్ణ చివుకుల అన్నారు. తాను విద్యాభ్యాసం చేసిన ఐఐటీ ఎం నుంచి తన దాతృత్వ కార్యక్రమాలు కొనసాగించాలని నిర్ణయించుకుని ఐఐటీఎంకు రూ.228 కోట్లను విరాళం ఇచ్చినట్టు తెలిపారు. 
 
ఆయన మంగళవారం మద్రాస్ ఐఐటీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డైరెక్టర్ కామకోటితో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఐఐటీ మద్రాస్‌కు రూ.228 కోట్ల విరాళం అందించాను. దేశంలోని ఏ యూనివర్సిటీకి కూడా ఒకేసారి ఇంత పెద్దమొత్తం వచ్చిన దాఖలా లేదు. ఇదంతా ఎందుకు చేస్తున్నానని కొందరు అడుగుతున్నారు. నేను ఆనందంగా ఉండాలి.. తద్వారా నా ఆరోగ్యం బాగుండాలని చేస్తున్నాను. ఇంతకుమించి నేనేమీ ఆశించడం లేదు' అని చెప్పారు. 
 
గత 55 యేళ్లుగా అమెరికాలో ఉంటున్నా. అక్కడి యూనివర్సిటీలకు ధనికులు విరివిగా విరాళాలు ఇస్తుంటారు. సమాజంలో విద్య, ఆరోగ్యం పెంచేందుకు, పేదరికం నిర్మూలించేందుకు ఆర్థికంగా అండగా నిలబడతారు. నా దేశానికి సేవ చేయాలని నాకూ ఎన్నో ఏళ్లుగా మనసులో బలంగా అనిపిస్తోంది. అమెరికావాళ్లు సైతం ఐఐటీ మద్రాస్ నుంచి వచ్చే ఇంజినీర్లను చూసి ఆశ్చర్యపోతుండటం చూశాను. అలాంటిచోట నేను చదువుకున్నాను. అందుకే నా దాతృత్వ కార్యక్రమాలు ఇక్కడి నుంచే మొదలు పెట్టాలని అనుకున్నాను అని చెప్పారు. 
 
తాను ఇచ్చి నిధులతో ఐఐటీ మద్రాస్‌లో పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు అందుతాయి. క్రీడాకారులకు ప్రోత్సాహం దక్కుతుంది. క్యాంపస్ నుంచి విడుదలవుతున్న మ్యాగజైన్లకు నిధుల లభ్యత ఏర్పడుతుంది. ఐదు కేటగిరీల్లో క్యాంపస్‌కు 25 ఏళ్ల పాటు ఎలాంటి డోకా ఉండదు అని ఆయన వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో గతంలోనే పరిశ్రమలు ఏర్పాటు చేశామని వాటిని మరింతగా విస్తరిస్తామని పేర్కొన్నారు. కృష్ణా చివుకుల సేవలకు గుర్తుగా ఐఐటీ మద్రాస్‌లోని ఓ అకడమిక్ బ్లాక్‌కు అధికారులు ఆయన పేరు పెట్టారు. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ బ్యాలెన్స్ అవేర్‌నెస్ వీక్‌లో వెర్టిగో చక్కర్ అంటే ఏమిటో తెలుసుకుందాం

అధిక రక్తపోటు వున్నవారు దూరం పెట్టాల్సిన పదార్థాలు

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

తర్వాతి కథనం
Show comments