Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిజోరంలో అధిక పిల్లలుంటే రూ.లక్ష బహుమతి

Webdunia
మంగళవారం, 22 జూన్ 2021 (12:00 IST)
దేశంలోని చాలా రాష్ట్రాలు జనాభా నియంత్రణను కోరుతుంటే.. మిజోరం మాత్రం అందుకు భిన్నంగా జనాభా పెరుగుదలను ప్రోత్సహిస్తూ సంచలన ప్రకటన చేసింది. అధిక సంఖ్యలో పిల్లలున్నవారికి రూ.లక్ష నగదు బహుమానాన్ని కూడా ప్రకటించింది. సర్టిఫికెట్‌, ట్రోఫీ కూడా ఇస్తామని పేర్కొంది.
 
మిజోరం రాష్ట్ర మంత్రి రాబర్ట్‌ రోమావియా రాయ్టే మాట్లాడుతూ... 2011 జనాభా లెక్కల ప్రకారం మిజోరం జనాభా 10,91,014 మంది ఉన్నారని, అతితక్కువ జనసాంద్రత ఉన్న ప్రాంతంగా పేరొందిందని తెలిపారు. మిజో జనాభా తగ్గుతుండటం తనను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందన్నారు.

ఐజాల్‌ ఈస్ట్‌ -2 అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధిక సంఖ్యలో సంతానం ఉన్న సజీవ పురుషుడు, లేదా స్త్రీకి లక్షరూపాయల నగదు బహుమతిని ఇస్తామని మంత్రి ప్రకటించారు. దీంతో పాటు సర్టిఫికెట్‌, ట్రోఫీని కూడా ఇస్తామన్నారు.

ఈ ప్రోత్సాహక బహుమతి ఖర్చును మంత్రి కుమారుడి యాజమాన్యంలోని నిర్మాణ కన్సల్టెన్సీ సంస్థ భరించనుంది. మిజో వర్గాల్లో జనాభా పెరుగుదలను ప్రోత్సహించడానికి తన నియోజకవర్గంలో అత్యధిక సంఖ్యలో పిల్లలతో నివశిస్తున్న తల్లిదండ్రులకు లక్షరూపాయల నగదు ప్రోత్సాహకాన్ని మంత్రి రాబర్ట్‌ ప్రకటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హన్సిక ఫోటోలు.. చీరలో అదరగొట్టిన దేశముదురు భామ

జానీ మాస్టర్ గురించి భయంకర నిజాలు చెప్పిన డాన్సర్ సతీష్ !

సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభం

నాగ చైతన్య, సాయి పల్లవి లకు వైజాగ్, శ్రీకాకుళంలో బ్రహ్మరధం

నెట్టింట యాంకర్ స్రవంతి ఫోటోలు వైరల్.. పవన్ కాదు అకీరా పేరు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

క్వీన్ ఆఫ్ ఫ్రూట్ మాంగోస్టీన్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఎర్రటి అరటి పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదేనా?

అంతర్జాతీయ యోగ దినోత్సవం: మీరు యోగా ఎందుకు చేయాలి?

తర్వాతి కథనం
Show comments