Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో రెండు నెలల పాటు లాక్ డౌన్ పెట్టాలి.. ఐసీఎంఆర్

Webdunia
శుక్రవారం, 14 మే 2021 (21:37 IST)
కరోనా పాజిటివిటీ రేటు 10 శాతం కంటే ఎక్కువగా ఉన్న జిల్లాల్లో 6 నుంచి 8 వారాల పాటు లాక్‌డౌన్‌ అవసరమని ఐసీఎంఆర్ కేంద్రానికి సూచించింది. అంటే దాదాపు 2 నెలలు లాక్‌డౌన్ పెట్టాలని తెలిపింది.
 
అధిక పాజిటివిటీ రేటు ఉన్న జిల్లాల్లో పూర్తి లాక్‌డౌన్‌ ఉండాల్సిందేనని ఐసీఎంఆర్ చీఫ్ బలరా భార్గవ అభిప్రాయపడ్డారు. అక్కడ పాజిటివిటీ రేటు 10 నుంచి 5 శాతానికి తగ్గిని తర్వాతే ఆంక్షలు సడలించవచ్చని అన్నారు. పాజిటివిటీ రేటు తగ్గాలంటే 6 నుంచి 8 వారాల లాక్‌డౌన్‌ అవసరమని ఆయన స్పష్టం చేశారు.
 
లాక్‌డౌన్ వల్ల ఢిల్లీలో మంచి ఫలితాలు వస్తున్నాయని బలరాం భార్గవ తెలిపారు. ఢిల్లీలో 35 శాతంగా ఉన్న పాజిటివిటీ రేటు లాక్‌డౌన్ తర్వాత ప్రస్తుతం 17 శాతానికి తగ్గిందని చెప్పారు. ఇప్పుడు లాక్‌డౌన్‌ను సడలిస్తే పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. 
 
ప్రస్తుతం మనదేశంలో గోవాలోనే అత్యధిక పాజిటివిటీ రేటు ఉంది. గోవాలో కరోనా పాజిటివిటీ రేటు 48శాతంగా ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో పుదచ్చేరి, పశ్చిమ బెంగాల్, హర్యానా, కర్ణాటక ఉన్నాయి. ఏపిలో 23శాతం, తెలంగాణలో 9శాతంగా ఉంది. మనదేశంలో కరోనా పాజిటివిటీ రేటు సరాసరి 21 శాతం ఉందని ఐసీఎంఆర్ తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: కమల్ హాసన్‌ను క్షమాపణ చెప్పమని కోరడం తగదు: సుప్రీం కోర్టు

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments