Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్ మాత్రలతో ఎముకలు - కండలు దెబ్బతినే ప్రమాదం : ఐసీఎంఆర్ వార్నింగ్

Webdunia
గురువారం, 6 జనవరి 2022 (08:42 IST)
తాజాగా దేశంలోకి కరోనా మాత్రలు కూడా అందుబాటులోకి వచ్చాయి. తొలుత అమెరికాలో అందుబాటులోకి వచ్చిన ఈ కరోనా మాత్రల కిట్ ఇపుడు మన దేశంలోకి కూడా వచ్చింది. అయితే, ఈ మాత్రల వల్ల ఎముకలు, కండరాలు దెబ్బతినే ప్రమాదం ఉందని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) చీఫ్ బలరాం భార్గవ హెచ్చరించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, మోలు లైఫ్ మాత్రలతో కండరాలు దెబ్బతింటాయని, మోల్నుఫిరవిర్ మాత్రలతో ఎముకలు దెబ్బతింటాయని వివరించారు. ఈ మాత్రలతో జన్యువుల్లో శాశ్వతంగా మార్పులు (మ్యూటాజెనెసిటీ) వస్తాయని తెలిపారు. 
 
ఇలా జరగడం వల్ల ఎముకలు, కండరాలు దెబ్బతినే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. అందుకే ఈ మాత్రలను కోవిడ్ జాతీయ టాస్క్‌ఫోర్స్ చికిత్సా మార్గదర్శకాల్లో చేర్చలేదని గుర్తుచేశారు. ఒకవేళ మహిళల ఈ మాత్రలను వాడితే కనీసం మూడు నెలల పాటు గర్భందాల్చకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. 
 
కాగా, కరోనా మాత్రలు మన దేశంలోకి అందుబాటులోకి రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ మాత్రలను దేశంలో హెటెరో, డాక్టర్ రెడ్డీస్ సహా 13 ఫార్మా సంస్థలు ఉత్పత్తి చేయనున్నాయి. ఆయా సంస్థలను బట్టి ధరల్లో వ్యత్యాసం ఉండే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

Sreeleela: జూనియర్ ఎన్టీఆర్‌ను చూసి ముచ్చటపడిన శ్రీలీల తల్లి స్వర్ణలత

Amani: ఒగ్గు కళాకారుల నేపథ్యం లో తెరకెక్కిన బ్రహ్మాండ చిత్రం

బార్బరిక్ షూటింగ్‌లో ప్రతీ రోజూ ఛాలెంజింగ్‌గా అనిపించేది : వశిష్ట ఎన్ సింహా

హర హర శంకర పాటలో సమాజంలో ఘోరాల్ని చూపించారు : తనికెళ్ళ భరణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments