Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐబీ ఆఫీసర్ హత్య - లొంగిపోయిన ఆప్ బహిష్కృత నేత

Webdunia
గురువారం, 5 మార్చి 2020 (15:35 IST)
ఢిల్లీలో ఇంటెలిజెన్స్ బ్యూరీ (ఐబీ) అధికారి అంకిత శర్మ హత్యకు గురయ్యారు. ఈ కేసులో ఆప్ బహిష్కృత నేత, కౌన్సిలర్ తాహీర్ హుస్సేన్ పోలీసులకు లొంగిపోయారు. అంకిత్‌ శర్మ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తూ వచ్చిన ఈయన.. గత కొన్ని రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో ఆయన కోసం పోలీసులు గాలిస్తూ వచ్చారు. 
 
ఈ క్రమంలో ఢిల్లీ కోర్టులో హుస్సేన్‌ ముందస్తు బెయిల్‌ కోసం మంగళవారం దాఖలు చేసుకున్నారు. ఈ బెయిల్‌ పిటిషన్‌ విచారణను కోర్టు గురువారం విచారణ జరగాల్సివుండగా, ఆయన పోలీసుల ఎదుట లొంగిపోయారు. 
 
గత నెల 24, 25 తేదీల్లో చాంద్‌బాగ్‌లోని హుస్సేన్‌ నివాసం నుంచి ఘర్షణలు ప్రారంభమైనట్లు పోలీసుల విచారణలో తేలింది. హుస్సేన్‌ ఇల్లు, ఫ్యాక్టరీ నుంచి యాసిడ్‌ సీసాలతో పాటు పెట్రోల్‌ బాంబులు స్వాధీనం చేసుకున్నారు. 
 
హుస్సేన్‌ నివాసంపై నుంచి ఇతర నివాసాలపైకి పెట్రోల్‌ బాంబులను విసిరినట్లు పోలీసులు నిర్ధారించారు. అంకిత్‌ శర్మ ఫిబ్రవరి 26న హత్యకు గురయ్యారు. ఆయన శరీరంపై సుమారు 400 కత్తిపోట్లు ఉన్నట్లు ఫోరెన్సిక్‌ నివేదికలో వెల్లడైంది. శర్మ హత్య కేసులో హుస్సేన్‌కు సంబంధం ఉందని తేలడంతో.. ఆప్‌ నుంచి ఆయనను సస్పెండ్‌ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments