Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐబీ ఆఫీసర్ హత్య - లొంగిపోయిన ఆప్ బహిష్కృత నేత

Webdunia
గురువారం, 5 మార్చి 2020 (15:35 IST)
ఢిల్లీలో ఇంటెలిజెన్స్ బ్యూరీ (ఐబీ) అధికారి అంకిత శర్మ హత్యకు గురయ్యారు. ఈ కేసులో ఆప్ బహిష్కృత నేత, కౌన్సిలర్ తాహీర్ హుస్సేన్ పోలీసులకు లొంగిపోయారు. అంకిత్‌ శర్మ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తూ వచ్చిన ఈయన.. గత కొన్ని రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో ఆయన కోసం పోలీసులు గాలిస్తూ వచ్చారు. 
 
ఈ క్రమంలో ఢిల్లీ కోర్టులో హుస్సేన్‌ ముందస్తు బెయిల్‌ కోసం మంగళవారం దాఖలు చేసుకున్నారు. ఈ బెయిల్‌ పిటిషన్‌ విచారణను కోర్టు గురువారం విచారణ జరగాల్సివుండగా, ఆయన పోలీసుల ఎదుట లొంగిపోయారు. 
 
గత నెల 24, 25 తేదీల్లో చాంద్‌బాగ్‌లోని హుస్సేన్‌ నివాసం నుంచి ఘర్షణలు ప్రారంభమైనట్లు పోలీసుల విచారణలో తేలింది. హుస్సేన్‌ ఇల్లు, ఫ్యాక్టరీ నుంచి యాసిడ్‌ సీసాలతో పాటు పెట్రోల్‌ బాంబులు స్వాధీనం చేసుకున్నారు. 
 
హుస్సేన్‌ నివాసంపై నుంచి ఇతర నివాసాలపైకి పెట్రోల్‌ బాంబులను విసిరినట్లు పోలీసులు నిర్ధారించారు. అంకిత్‌ శర్మ ఫిబ్రవరి 26న హత్యకు గురయ్యారు. ఆయన శరీరంపై సుమారు 400 కత్తిపోట్లు ఉన్నట్లు ఫోరెన్సిక్‌ నివేదికలో వెల్లడైంది. శర్మ హత్య కేసులో హుస్సేన్‌కు సంబంధం ఉందని తేలడంతో.. ఆప్‌ నుంచి ఆయనను సస్పెండ్‌ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments