Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్భయ దోషులకు 20న ఉదయం 5.30 గంటలకు ఉరి...

Webdunia
గురువారం, 5 మార్చి 2020 (14:55 IST)
నిర్భయ అత్యాచార కేసులో దోషులకు ఈ నెల 20వ తేదీన ఉరిశిక్షలను అమలు చేయనున్నారు. 20వ తేదీ ఉదయం 5.30 ఉరి తీయాల్సిందిగా ఢిల్లీ పాటియాలా కోర్టు గురువారం డెత్ వారెంట్‌ను జారీచేసింది. దీంతో ఈ దఫా ఖచ్చితంగా ఉరిశిక్షలను అమలు చేయడం ఖాయమని తెలుస్తోంది. 
 
నిజానికి ఈ కేసులో దోషులుగా తేలిన పవన్ కుమార్ గుప్తా, వినయ్ శర్మ, ముఖేష్, అక్షయ్‌లు ఉరిశిక్షలను తప్పించుకునేందుకు న్యాయ వ్యవస్థలోని అన్ని లొసుగులను ఉపయోగించుకుని, తమ శిక్షలను వాయిదా వేస్తూ వచ్చారు. అలాగే, పదేపదే కోర్టులకు వెళ్లడం, క్యూరేటివ్ పిటిషన్లు దాఖలు చేయడం, రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్లను సమర్పించుకోవడం ఇలా కాలయాపన చేస్తూ వచ్చారు. 
 
దీంతో పాటియాలా కోర్టు గతంలో మూడు సార్లు డెత్ వారెంట్లు జారీ చేసినప్పటికీ శిక్షలను అమలు చేయలేకపోయారు. ఈ నేపథ్యంలో ఈ నలుగురు దోషులకు పాటియాలా హౌస్‌ కోర్టు కొత్త డెత్‌ వారెంట్లు జారీ చేసింది. మార్చి 20వ తేదీన ఉదయం 6 గంటలకు నలుగురు దోషులను ఉరి తీయాలని పాటియాలా హౌస్ కోర్టు అడిషనల్ సెషన్స్ జడ్జి ధర్మేందర్ రానా ఆదేశాలు జారీ చేశారు. ఉరి శిక్షకు సంబంధించి తీహార్‌ జైల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే రెండు సార్లు నలుగురు నిందితులకు ఉరి శిక్ష వాయిదా పడిన సంగతి తెలిసిందే. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tanushree Dutta: నన్ను వేధిస్తున్నారు, కాపాడండి, తనుశ్రీ కన్నీటి పర్యంతం (video)

Rasi: ప్రేయసిరావే లో శ్రీకాంత్‌ని కొట్టాను, హిట్‌ అయ్యింది, ఉసురే కూడా అవుతుంది : హీరోయిన్‌ రాశి

Mirai: తేజ సజ్జ, రితికా నాయక్ పోస్టర్ తో మిరాయ్ ఫస్ట్ సింగిల్ రానున్నట్లు ప్రకటన

రతన్ టాటా పెళ్లి చేసుకున్నారా? పెళ్లి అనేది జీవితంలో ఓ భాగం : నిత్యా మీనన్

Suriya: కరుప్పు తో ఇది మన టైం. కుమ్మి పడదొబ్బుతా.. అంటున్న సూర్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments