Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్భయ దోషులకు 20న ఉదయం 5.30 గంటలకు ఉరి...

Webdunia
గురువారం, 5 మార్చి 2020 (14:55 IST)
నిర్భయ అత్యాచార కేసులో దోషులకు ఈ నెల 20వ తేదీన ఉరిశిక్షలను అమలు చేయనున్నారు. 20వ తేదీ ఉదయం 5.30 ఉరి తీయాల్సిందిగా ఢిల్లీ పాటియాలా కోర్టు గురువారం డెత్ వారెంట్‌ను జారీచేసింది. దీంతో ఈ దఫా ఖచ్చితంగా ఉరిశిక్షలను అమలు చేయడం ఖాయమని తెలుస్తోంది. 
 
నిజానికి ఈ కేసులో దోషులుగా తేలిన పవన్ కుమార్ గుప్తా, వినయ్ శర్మ, ముఖేష్, అక్షయ్‌లు ఉరిశిక్షలను తప్పించుకునేందుకు న్యాయ వ్యవస్థలోని అన్ని లొసుగులను ఉపయోగించుకుని, తమ శిక్షలను వాయిదా వేస్తూ వచ్చారు. అలాగే, పదేపదే కోర్టులకు వెళ్లడం, క్యూరేటివ్ పిటిషన్లు దాఖలు చేయడం, రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్లను సమర్పించుకోవడం ఇలా కాలయాపన చేస్తూ వచ్చారు. 
 
దీంతో పాటియాలా కోర్టు గతంలో మూడు సార్లు డెత్ వారెంట్లు జారీ చేసినప్పటికీ శిక్షలను అమలు చేయలేకపోయారు. ఈ నేపథ్యంలో ఈ నలుగురు దోషులకు పాటియాలా హౌస్‌ కోర్టు కొత్త డెత్‌ వారెంట్లు జారీ చేసింది. మార్చి 20వ తేదీన ఉదయం 6 గంటలకు నలుగురు దోషులను ఉరి తీయాలని పాటియాలా హౌస్ కోర్టు అడిషనల్ సెషన్స్ జడ్జి ధర్మేందర్ రానా ఆదేశాలు జారీ చేశారు. ఉరి శిక్షకు సంబంధించి తీహార్‌ జైల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే రెండు సార్లు నలుగురు నిందితులకు ఉరి శిక్ష వాయిదా పడిన సంగతి తెలిసిందే. 
 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments