Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఏఏ - ఎన్నార్సీ - ఎన్పీఆర్ వెనక్కి తీసుకోవాల్సిందే : మోడీని కోరిన మమతా

Webdunia
ఆదివారం, 12 జనవరి 2020 (12:35 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నరేంద్ర మోడీతో వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర జాబితా, ఎన్పీఆర్‌లను వెనక్కి తీసుకోవాలని కోరారు. 
 
మోడీతో సమావేశం తర్వాత మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడుతూ, ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని చెప్పారు. పౌరసత్వ సవరణ చట్టంపై పునరాలోచించుకోవాలని ప్రధానిని కోరినట్టు తెలిపారు. 
 
దీంతోపాటు రాష్ట్రానికి కేంద్రం నుంచి దాదాపు రూ.28 వేల కోట్ల నిధులు రావాల్సి ఉన్నదని, వాటిని వెంటనే విడుదల చేయాలని కోరినట్టు చెప్పారు. ఈ అంశాలపై చర్చించేందుకు తనను ఢిల్లీకి రావాల్సిందిగా ప్రధాని కోరారని చెప్పారు. 
 
రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నార్సీని అమలు చేయబోమన్నారు. కేంద్ర హోం మంత్రిత్వశాఖ విడుదల చేసిన గెజిట్‌పై స్పందిస్తూ... సీఏఏ ఇకపై కాగితాలకే పరిమితమవుతుందన్నారు. మరోవైపు ప్రధానితో మమత భేటీని కాంగ్రెస్, వామపక్షాలు తప్పుబట్టాయి. మమత ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు సోమన్ మిత్రా విమర్శించారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments