Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఏఏ - ఎన్నార్సీ - ఎన్పీఆర్ వెనక్కి తీసుకోవాల్సిందే : మోడీని కోరిన మమతా

Webdunia
ఆదివారం, 12 జనవరి 2020 (12:35 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నరేంద్ర మోడీతో వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర జాబితా, ఎన్పీఆర్‌లను వెనక్కి తీసుకోవాలని కోరారు. 
 
మోడీతో సమావేశం తర్వాత మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడుతూ, ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని చెప్పారు. పౌరసత్వ సవరణ చట్టంపై పునరాలోచించుకోవాలని ప్రధానిని కోరినట్టు తెలిపారు. 
 
దీంతోపాటు రాష్ట్రానికి కేంద్రం నుంచి దాదాపు రూ.28 వేల కోట్ల నిధులు రావాల్సి ఉన్నదని, వాటిని వెంటనే విడుదల చేయాలని కోరినట్టు చెప్పారు. ఈ అంశాలపై చర్చించేందుకు తనను ఢిల్లీకి రావాల్సిందిగా ప్రధాని కోరారని చెప్పారు. 
 
రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నార్సీని అమలు చేయబోమన్నారు. కేంద్ర హోం మంత్రిత్వశాఖ విడుదల చేసిన గెజిట్‌పై స్పందిస్తూ... సీఏఏ ఇకపై కాగితాలకే పరిమితమవుతుందన్నారు. మరోవైపు ప్రధానితో మమత భేటీని కాంగ్రెస్, వామపక్షాలు తప్పుబట్టాయి. మమత ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు సోమన్ మిత్రా విమర్శించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Veera Dheera Sooran: చియాన్ విక్రమ్ వీర ధీర సూరన్ పార్ట్ 2 - మార్చి 27 గ్రాండ్ రిలీజ్

Janhvi Kapoor : RC16 లో టెర్రిఫిక్ రోల్ చేస్తున్న జాన్వి కపూర్ !

ఉపవాసం దీక్ష తో మూకుత్తి అమ్మన్ 2 చిత్ర పూజకు హాజరైన నయనతార

మ్యారేజ్ అంటే ఒప్పందం, సెటిల్మెంట్ కాదని చెప్పే చిత్రం మిస్టర్ రెడ్డి

Divya Bharathi: యాక్షన్ సీన్స్ చేయడం కష్టం, ఇలాంటి సినిమా మళ్ళీ రాదు : దివ్యభారతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

మహిళలు ప్రతిరోజూ ఆపిల్ కాదు.. ఆరెంజ్ పండు తీసుకుంటే.. ఏంటి లాభమో తెలుసా?

Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు

పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments