Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రహ్మపుత్ర నదిలో ఘోర ప్రమాదం.. భద్రత, శ్రేయస్సు కోసం ప్రార్థిస్తున్నాను..

Webdunia
గురువారం, 9 సెప్టెంబరు 2021 (11:54 IST)
అస్సాంలోని బ్రహ్మపుత్ర నదిలో ఘోర ప్రమాదం జరిగింది. దాదాపు 120 మందితో ప్రయాణిస్తున్న ఓ పడవ.. ప్రభుత్వానికి చెందిన ఓ స్టీమర్‌ను ఢీకొట్టి మునిగిపోయింది. జోర్హాత్‌ జిల్లాలోని నీమతి ఘాట్‌ సమీపంలో బుధవారం సాయంత్రం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఇప్పటివరకూ 50 మందిని రక్షించామని, 70 మంది వరకు గల్లంతైనట్టు జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్‌ఎఫ్‌) డిప్యూటీ కమాండర్‌ శ్రీవాస్తవ తెలిపారు. 
 
రాష్ట్ర జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎస్డీఆర్‌ఎఫ్‌)తో కలిసి సహాయక చర్యలు చేపడుతున్నట్టు పేర్కొన్నారు. పడవ ప్రమాదంలో ఒక మహిళ మరణించినట్టు జోర్హాత్‌ ఎస్పీ అంకూర్‌ జైన్‌ తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరుగొచ్చన్నారు. 
 
పడవ ఢీకొన్న స్టీమర్‌లో ఉన్న లైఫ్‌గార్డుల సాయంతో కొంతమంది ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చినట్టు వెల్లడించారు. పడవలో ఉన్న వాహనాలు, బైకుల కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు అనుమానం వ్యక్తం చేశారు. కాగా పడవ మునిగిపోతున్న సమయంలో ప్రాణాలను రక్షించుకోవడానికి కొందరు నదిలో దూకుతున్నట్టు వీడియోల్లో రికార్డయ్యింది.
 
ఈ ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందిస్తూ.. అందరి భద్రత, శ్రేయస్సు కోసం నేను ప్రార్థిస్తున్నాను. అస్సాం పడవ ప్రమాదంపై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మను పిలిచి సహాయక చర్యల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన అన్ని వివరాలను ఆయనకు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

తర్వాతి కథనం
Show comments