Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక్క ఏడాదిలో 70లక్షల మందికి బిర్యానీ వడ్డించింది.. ఇంకా?

Webdunia
ఆదివారం, 24 ఫిబ్రవరి 2019 (15:36 IST)
ప్యారడైజ్ బిర్యానీకి అరుదైన గౌరవం దక్కింది. ఒక్క ఏడాదిలోనే ప్యారడైజ్ హోటల్ దాదాపు 70లక్షల మంది వినియోగదారులకు బిర్యానీ వడ్డించింది. ఇంత భారీ స్థాయిలో బిర్యానీ విక్రయించినందుకు గాను ప్యారడైజ్‌‌ ఛైర్మన్‌ అలీ హేమతికి ఆసియా ఫుడ్‌ కాంగ్రెస్‌ సంస్థ లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు కూడా ప్రకటించింది. 
 
దేశ వ్యాప్తంగా ఎంతో పేరు తెచ్చుకున్న ఈ ప్యారడైజ్ బిర్యానీ ప్రస్తుతం లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకోవడం ద్వారా ఆ సంస్థ అధికారులు పండగ చేసుకున్నారు. ఇందులో భాగంగా సికింద్రాబాద్‌లోని ప్యారడైజ్‌‌ హోటల్లో గురువారం కేక్‌ కట్‌ చేసి సిబ్బంది సంబరాలు జరుపుకున్నారు. 
 
2017 జనవరి 1 నుంచి అదే ఏడాది డిసెంబర్ 31 వరకు 70,44,289 బిర్యానీలను విక్రయించినట్లు సంస్థ తెలిపింది. బెస్ట్ బిర్యానీ అవార్డును సైతం ప్యారడైజ్ బిర్యానీ కైవసం చేసుకుంది. ప్యారడైజ్ బిర్యానీ సంస్థల చైర్మన్ అలీ హేమతికి ఆసియా ఫుడ్ కాంగ్రెస్ సంస్థ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును ప్రకటించి గౌరవించింది
 
ఈ సందర్భంగా ఛైర్మన్ అలీ మాట్లాడుతూ.. లిమ్కా బుక్ అవార్డుతో తమపై బాధ్యత మరింత పెరిగిందన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 37 ప్యారడైజ్‌ బ్రాంచ్‌లు ఉన్నాయని, త్వరలోనే విదేశాల్లోనూ ప్రారంభించబోతున్నామని వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments