Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిస్డ్ కాల్‌తో యువకుడిని పట్టేసింది, భర్తకు తెలిసి కరోనా క్వారెంటైన్లో పడిపోయింది...

Webdunia
బుధవారం, 8 జులై 2020 (13:51 IST)
ఈమధ్య కాలంలో సెల్ ఫోన్ల ప్రేమాయణం ఎక్కువయిపోతున్నాయి. జస్ట్ ఫోన్ కాల్ తోనే దగ్గరపోతున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఆ తర్వాత అవి కాస్తా పెటాకులవుతున్నాయి. అలాంటి ఘటనే తమిళనాడులోని నెల్‌లై జిల్లా సేరన్‌ మహాదేవిలో జరిగింది.
 
వివరాల్లోకి వెళితే... తమిళనాడులోని నెల్‌లై జిల్లా సేరన్‌ మహాదేవి కూలీ కార్మికుడు తన సమీప బంధువుల కుమార్తె అయిన మహిళతో పదేళ్ల క్రితం పెళ్లయింది. వీరికి 8 ఏళ్ల కుమారుడు, 4 ఏళ్ల కుమార్తె వున్నారు. ఐతే ఏడాదిన్నర క్రితం ఆమె ఫోనుకి కాయత్తార్‌కి చెందిన ఓ యువకుడి నుంచి ఓ మిస్డ్ కాల్ వచ్చింది. తొలుత దాన్ని పట్టించుకోలేదు కానీ ఆ తర్వాత ఆ మిస్డ్ కాల్ నుంచి వచ్చిన నెంబరుకి ఫోన్ చేసింది.
 
అవతల ఓ యువకుడు మాట్లాడటంతో కొద్దిసేపు ముచ్చటించింది. అలా సాగిన ముచ్చట్లు కాస్తా ప్రేమగా మారిపోయింది. ఐతే తనకు పెళ్లయినట్లు వివాహిత మహిళ చెప్పలేదు. ఈ క్రమంలో తనను పెళ్లాడాలని యువకుడికి చెప్పడంతో అతడు కూడా సరేనన్నాడు. అలా 29 ఏళ్ల ఆ మహిళ 24 ఏళ్ల యువకుడిని గత 20వ తేదీ ప్రియుడితో తెన్‌కాశి సమీపంలో సుందరపాండియన్‌ పురానికి వెళ్లి ప్రియుడి బంధువుల ముందు వివాహం చేసుకుంది.
 
ఊరుకి వెళ్లివస్తానని చెప్పిన తన భార్య ఎంతకీ తిరిగి రాకపోవడంతో భర్త పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేశాడు. మరోవైపు ప్రియుడిని పెళ్లాడిన మహిళ తన ఫోనులోని వాట్సాప్ స్టేటస్ లో ప్రియుడితో వున్న ఫోటోను పెట్టేసింది. ఇది కాస్తా భర్త చూసి విషయాన్ని పోలీసులకు చేరవేశాడు. దీంతో జులై 1వ తేదీన సదరు మహిళను, ప్రియుడిని పిలిచి విచారించగా అసలు విషయం బయటపడింది.
 
అప్పటికే పెళ్లయిన మహిళ తనకు వద్దని ఆ యువకుడు చెప్పేశాడు. మరోవైపు ఎవడినో పెళ్లి చేసుకున్న తన భార్య తనకు అవసరం లేదని భర్త చెప్పేశాడు. దీనితో ఆ మహిళను అంగీకరించడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో ప్రస్తుతానికి సదరు మహిళను సేరన్‌ మహాదేవిలోని కరోనావైరస్ శిబిరానికి పంపారు. మూడు రోజులుగా ఆ మహిళ శిబిరంలోనే ఉంది. చివరికి ఆమెను ఎవరు అంగీకరిస్తారన్నది ప్రశ్నగా మిగిలింది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments