Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య కళ్ళలో కారం చల్లాడు.. పెట్రోల్ పోసి సజీవ దహనం చేశాడు.. జీవితఖైదు

సెల్వి
శుక్రవారం, 7 ఫిబ్రవరి 2025 (22:13 IST)
తన భార్య కళ్ళలో కారం పొడి చల్లి సజీవ దహనం చేసిన దారుణ నేరానికి ఒక వ్యక్తికి జీవిత ఖైదు విధించింది ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లోని ఓ కోర్టు. వివరాల్లోకి వెళితే.. సచిన్ అనే వ్యక్తి మత్తు పదార్థాలకు బానిసయ్యాడు. తన భర్త ప్రవర్తనను భార్య వ్యతిరేకించింది. 
 
ఈ వ్యవహారంపై రోజూ గొడవలు జరిగేవి. ఇంకా తన భార్యను కొడుతుండేవాడని తెలిసింది. ఆమెను వేధించడంలో అతని అత్తమామలు కూడా తోడయ్యారు. బాధితురాలు మరణించే సమయానికి 35 సంవత్సరాలు. 2012లో మృతురాలు సచిన్‌ను వివాహం చేసుకుంది.  
 
ఈ సంఘటన ఏప్రిల్ 3, 2022న జరిగింది. ఆ రోజు తన భార్యను వేధింపులకు గురి చేసి.. సచిన్ ఆమె కళ్ళలో కారం పొడి చల్లాడు. ఆపై ఆమెను సచిన్ తల్లిదండ్రులు, బంధువుల మద్దతుతో ఆమెపై డీజిల్ పోసి నిప్పంటించాడు. మూడు నెలలకు పైగా ప్రాణాలతో పోరాడిన ఆమె జూలై 3, 2022న మరణించింది. ఈ నేపథ్యంలో బిజ్నోర్‌ అదనపు సెషన్స్ జడ్జి అనుపమ్ సింగ్ సచిన్‌కు జీవిత ఖైదు, రూ. 25,000 జరిమానా విధించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చాలా కాలంగా మిస్ అయ్యాను, తండేల్ తో మళ్ళీ నాకు తిరిగివచ్చింది : అక్కినేని నాగచైతన్య

చిరంజీవి పేరు చెప్పడానికి కూడా ఇష్టపడని అల్లు అరవింద్

మాస్ ఎంటర్‌టైనర్‌ గా సందీప్ కిషన్ మజాకా డేట్ ఫిక్స్

బొమ్మరిల్లు బాస్కర్, సిద్ధు జొన్నలగడ్డ కాంబోలో వినోదాత్మకంగా జాక్ టీజర్

తెలంగాణ దర్శకుడు తనయుడు దినేష్‌మహీంద్ర దర్శకత్వంలో లవ్‌స్టోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Rose Day 2025 : రోజ్ డే 2025- ఏ రంగులో గులాబీ పువ్వు? వాడిపోయిన పువ్వులు?

రోజుకి గ్లాసు పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments