బ్రహ్మణుడని చెప్పి పెళ్లి చేసుకున్నాడు.. శోభనం అయ్యాక నిజం చెప్పాడు...

Webdunia
శుక్రవారం, 26 అక్టోబరు 2018 (11:33 IST)
కట్టుకున్న భర్త చేతిలో భార్య మోసపోయింది. తాను బ్రహ్మణ కులానికి చెందిన వ్యక్తినని నమ్మించి పెళ్ళి చేసుకున్నాడు. తీరా శోభనం ముగిసిన తర్వాత తాను బ్రహ్మణుడు కాదనే నిజం భార్యకు చెప్పాడు. దీంతో ఆ వివాహిత పోలీసులను ఆశ్రయించింది. గుజరాత్ రాష్ట్రంలో వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
బేచ్‌రాజి తాలూకా అడివాడ గ్రామానికి చెందిన ఎక్తాపటేల్ అనే యువతి గత ఏడాది ఏప్రిల్‌లో ఎంకాం విద్యను పూర్తి చేసింది. తన విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా ఎక్తాపటేల్ మెహసానా ప్రాంతంలోని ఓ గ్యాస్ ఏజెన్సీలో అకౌంటెంట్‌గా చేరింది. 
 
గ్యాస్ డీలరు జ్యోత్స్నా కుమారుడు యష్‌తో ఎక్తాపటేల్‌కు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. తాము కూడా బ్రాహ్మణకులానికి చెందిన వారిమని ఏక్తాను యష్ నమ్మించాడు. 
 
దీంతో ఈ యేడాది ఏప్రిల్ 23వతేదీన ఏక్తాపటేల్, యష్‌లు పెళ్లి చేసుకున్నారు. శోభనం తర్వాత తాము బ్రాహ్మణులం కాదనే నిజాన్ని యష్ తన భార్యకు చెప్పాడు. దీంతో తనను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని పేర్కొంటూ భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bandla Ganesh: బండ్ల గణేష్ పై ఇండస్ట్రీ సీరియస్ - గబ్బర్ సింగ్ లాంటి సినిమా తీయలేనా?

Manoj: ఎవరినీ మోసం చేయను, మౌనిక ను బాగా చూసుకుంటా : మంచు మనోజ్

ప్రైమ్ వీడియోలో మా దృష్టి గొప్ప కథలను నిర్మించడం మీదే ఉంది - పద్మా కస్తూరిరంగన్

ప్రణవ్ మోహన్ లాల్.. డీయస్ ఈరే... శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా విడుదల

పురుషః పాత్రల ఫస్ట్ లుక్ ఆవిష్కరించిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments