Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎవడితో కులుకుతున్నావ్ అంటూ భార్యను కత్తితో పొడిచి తల నరికేశాడు...

Webdunia
బుధవారం, 17 ఏప్రియల్ 2019 (12:59 IST)
తమిళనాడు రాష్ట్రంలో దారుణమైన ఘటన జరిగింది. కట్టుకున్న భార్య వివాహేతర సంబంధం కొనసాగిస్తుందన్న అనుమానంతో ఓ వ్యక్తి ఆమెను విచక్షణారహితంగా పొడిచి ఆ తర్వాత ఆమె తలను నరికేశాడు. ఈ దారుణ ఘటన వివరాలు ఇలా వున్నాయి.
 
కర్నాటకకు చెందిన 18 ఏళ్ల మునియప్పన్ 19 ఏళ్ల నివేదతో పెళ్లయింది. వివాహం అయిన తర్వాత ఉపాధి నిమిత్తం వారు తమిళనాడు రాష్ట్రంలోని ఈరోడ్ సమీపంలోని మెట్టుకడాయ్ ప్రాంతానికి వలస వచ్చారు. అక్కడ మునియప్పన్ ఓ గ్యాస్ ఏజెన్సీలో పని కుదుర్చుకుని చేస్తున్నాడు. అతడి భార్య సమీపంలోని ఓ దుకాణంలో చేస్తోంది. ఐతే దుకాణంలో పనిచేస్తున్న తన భార్య కొందరు యువకులతో వివాహేతర సంబంధం పెట్టుకుందని అతడు అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయంపై పలుమార్లు ఆమెతో గొడవపడ్డాడు. 
 
చివరికి సోమవారం నాడు ఇద్దరి మధ్య వాగ్వాదం పెచ్చుమీరింది. దీనితో అతడు కత్తి తీసుకుని ఆమెను పొడిచేసాడు. అంతటితో ఆగకుండా ఆమె తల నరికి వేరు చేసి ఆమె శరీర భాగాలను గోనె సంచిలో మూటగట్టి తన ద్విచక్ర వాహనంపై వేసుకుని బయలుదేరాడు. ఆమె మృతదేహాన్ని సమీపంలోని చెరువులో పడవేసేందుకు చూస్తుండగా స్థానికులు గోనె సంచిలో మృతదేహం కాళ్ల బయటకు కనబడటంతో భయాందోళనలకు గురై పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు అతడిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ కృష్ణుడు అయితే నేను కర్ణుడిని : విష్ణు మంచు చమక్కులు

ద‌ళ‌ప‌తి విజ‌య్ మూవీ జ‌న నాయ‌కుడు నుంచి ఫ‌స్ట్ రోర్ రిలీజ్‌

కృష్ణంరాజు డైలాగ్ కత్తందుకో జానకి ని గీతం మార్చిన మిత్ర మండలి

Anushka: అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు చిత్రం ఘాటి లో ఫోక్ సాంగ్ సైలోరే రిలీజ్

Ratnavel: పెద్ది కోసం హ్యుజ్ యాక్షన్ నైట్ సీక్వెన్స్ చేస్తున్న రామ్ చరణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments