Webdunia - Bharat's app for daily news and videos

Install App

శబరిమల తరహాలో మసీదుల్లో మహిళలు ప్రవేశం కల్పించండి..

Webdunia
బుధవారం, 17 ఏప్రియల్ 2019 (12:15 IST)
శబరిమల తరహాలో సుప్రసిద్ధ మసీదుల్లో తమకు ప్రవేశం కల్పించాలని.. ముస్లిం మహిళలు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే ట్రిపుల్ తలాఖ్‌పై నిషేధం సాధించుకున్న ముస్లిం మహిళలు.. తాజాగా మసీదుల్లోకి ముస్లీం మహిళలు రాకుండా ఆంక్షలు విధించడం రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలనీ కోరారు. ముస్లిం మహిళలు మసీదుల్లో ప్రార్థనలు జరుపుకునేలా అనుమతిని ఇవ్వాలని కోరుతూ పూణెకి చెందిన దంపతులు సుప్రీమ్ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. 
 
ఈ పిటిషన్‌పై సుప్రీం కోర్టు కూడా సానుకాలంగా స్పందించింది. మసీదుల్లో ముస్లిం మహిళలక ప్రవేశానికి చట్టబద్ధంగా అనుమతించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను న్యాయస్థానం పరిశీలించింది. కెనడా, మక్కా వంటి సుప్రసిద్ధ మసీదుల్లో మహిళలను అనుమతిస్తున్నారని న్యాయవాదులు తెలపడంతో ఈ పిటీషన్‌పై విచారణ జరిపేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది. 
 
శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం కేసులో తీర్పు ఇచ్చినందువల్లనే ఈ పిటీషన్‌ను కూడా స్వీకరించినట్టు జస్టిస్ ఎస్.ఎ. బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. పురుషులకు సమానంగా స్త్రీలు కూడా మసీదుల్లో ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతి ఇచ్చే అంశంపై విచారణ జరుపనున్నట్లు సుప్రీం కోర్టు పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments