Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోడలికి అండగా అత్తమామలు.. భర్త చనిపోయినా.. వేరొక వ్యక్తితో..?

Webdunia
సోమవారం, 24 జనవరి 2022 (17:21 IST)
పెళ్లైన ఆరు నెలలకే భర్త చనిపోయాడు. కానీ ఆ వృద్ధ అత్తమామలు.. కోడలికి అండగా నిలిచారు. ఆమెను చదివించి ఉద్యోగం పొందేలా ప్రోత్సహించారు. 
 
అంతటితో ఆగలేదు.. కోడలికి వేరొక వ్యక్తితో వివాహం జరిపించారు. ఈ ఆదర్శ అత్తమామల గురించిన వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని సికార్‌కు చెందిన కమలా దేవి, దిలావర్ దంపతుల కుమారుడు శుభమ్‌కు 2016లో సునీత అనే యువతితో వివాహం జరిగింది.
 
వివాహం జరిగిన ఆరు నెలలకే బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో శుభమ్ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో సునీత ఒంటరి అయిపోయింది. పేద కుటుంబానికి చెందిన సునీతను కమలా దేవి దంపతులు వదులుకోలేదు.
 
ఆమెను తమ దగ్గరే ఉంచుకుని చదివించారు. అత్తమామల ప్రోత్సాహంతో సునీత ఎమ్.ఎ.బీ.ఈడీ చదవింది. పోటీ పరీక్ష రాసి జూనియర్ లెక్చరర్‌గా కూడా ఎంపికైంది.
 
సునీత్ జీవితంలో స్థిరపడింది. ఇంకా ఆడిటర్ ముఖేష్‌ అనే వ్యక్తితో సునీతకు పెళ్లి నిర్ణయించారు. గత శనివారం దగ్గరుండి వారి పెళ్లి జరిపించారు. 
 
అత్తమామలను విడిచి వెళ్లేటపుడు సునీత కన్నీళ్లు పెట్టుకుంది. కోడలి పట్ల ఎంతో ఆదరణ చూపించిన కమలా దేవి, దిలావర్ దంపతులపై బంధుమిత్రులు ప్రశంసలు కురిపించారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments