Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త మోసం చేశాడు.. పిల్లలకు మత్తు మందు ఇచ్చి నిప్పంటించి.. ఆపై ఆమె కూడా?

Webdunia
శుక్రవారం, 11 సెప్టెంబరు 2020 (10:17 IST)
భర్త వేరొక యువతితో అక్రమ సంబంధం ఏర్పరుచుకుని.. ఆమె కోసం తనను వదిలేశాడన్న మనస్తాపంతో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. భర్త వేరే యువతితో వెళ్లిపోయాడని మనస్థాపానికి గురైన భార్య ముందుగా తన పిల్లలపై పెట్రోల్ పోసి నిప్పంటించి తరవాత తానూ ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన తమిళనాడు అరంతాంగిలో చోటు చేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే... పుదుకోట్టై జిల్లా అరంతాంగి సమీపంలోని వల్లంబాక్కం కాడులో ముత్తు(45), రాధ(34) దంపతులు ఉంటున్నారు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా ముత్తు కొంతకాలంగా అరంతాంగిలోని ఓ కళాశాలలో చదువుకుంటున్న రత్న కోట గ్రామానికి చెందిన 22 ఏళ్ల యువతితో ప్రేమాయణం నడుపుతున్నాడు. భార్య పలు మార్లు మందలించినప్పటికీ అతడి తీరులో మార్పు రాలేదు.
 
అంతే కాకుండా విద్యార్థినిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. దీంతో ఆ విద్యార్థినితో పరార్‌ అయ్యాడు. సమాచారంతో ఆ విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రాధను ప్రశ్నించడమే కాకుండా, ముత్తుపై కిడ్నాప్‌ కేసు నమోదు చేశారు. భార్య చేష్టలకు విసిగిపోయింది.
 
అవమానంగా భావించిన రాధ ఇంట్లో ఎవరూ లేనిసమయంలో పిల్లలకు మత్తు మందు ఇచ్చి వారికీ నిప్పంటించింది. అనంతరం తానూ అగ్నికి ఆహుతయ్యింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు భర్తపై కేసు నమోదు చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

'కాంటా లగా' ఫేమ్ షఫాలీ జరివాలా హఠాన్మరణం

రెండోసారి తల్లి అయిన గోవా బ్యూటీ...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments