Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వావివరుసలు మరిచి సోదరుడితో అక్రమ సంబంధం.. భర్తను హతమార్చి పరార్...

వావివరుసలు మరిచి సోదరుడితో అక్రమ సంబంధం.. భర్తను హతమార్చి పరార్...
, గురువారం, 10 సెప్టెంబరు 2020 (12:28 IST)
పలువురు స్త్రీపురుషులు సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తిస్తున్నారు. కామంతో కళ్లుమూసుకునిపోయి వావి వరుసలు మరిచిపోయి పరాయి స్త్రీపురుషులతో సంబంధాలు పెట్టుకుంటున్నారు. ఆ తర్వాత తాము కట్టుకున్న వారిని దారుణంగా హతమార్చుతున్నారు. తాజాగా ఫిలిబిత్‌లో ఓ మహిళ... వావివరుసలు మరిచిపోయి.. సోదరుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ విషయం భర్తకు తెలియడంతో అతన్ని దారుణంగా హతమార్చి, ప్రియుడితో కలిసిపారిపోయింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫిలిబిత్ జిల్లా, గజ్రౌలా పోలీస్ స్టేషన్ పరిధిలోని సుహాస్ గ్రామానికి చెందిన రాందాస్ (40) అనే వ్యక్తి నన్హిదేవి అనే మహిళను కొన్నేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అయితే, నన్హిదేవి తనకు సోదరుడి వరుసయ్యే ఉమాస్సార్ గ్రామానికి చెందిన బన్వరీ లాల్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది.
 
ఈ విషయం భర్తకు తెలియడంతో భార్యను మందలించాడు. దీన్ని జీర్ణించుకోలేని నన్హిదేవి.. తమ బంధానికి భర్త అడ్డొస్తున్నాడని ఆగ్రహించుకుంది. ఈ క్రమంలో సోమవారం రాత్రి ఇద్దరూ కలిసి రాందాస్‌ నిద్రపోతుండగా, నైలాన్‌ తాడు బిగించి హతమార్చి పరారయ్యారు. 
 
ఉదయం మృతుడి తండ్రి లాల్‌జీత్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. గజ్రౌలా-డియోరియా రహదారిపై అగ్యారీ క్రాసింగ్ వద్ద నన్హి దేవితోపాటు భన్వరీ లాల్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సోదరుడితో వివాహేతర సంబంధం.. భర్త అడ్డుగా వున్నాడని చంపేసింది..