Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాశ్మీర్‌లో ఖాళీ అవుతున్న కాంగ్రెస్ - పార్టీ వీడిన సీనియర్లు

Webdunia
బుధవారం, 31 ఆగస్టు 2022 (12:19 IST)
సీనియర్ రాజకీయ నేత, మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీని వీడారు. దీంతో ఆయనకు మద్దతుగా అనేక మంది ఆ పార్టీని వీడుతున్నారు. అంటే గులాం నబీ ఆజాద్ దెబ్బకు జమ్మూకాశ్మీర్‌లోని కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతోంది. తాజాగా ఏకంగా 64 మంది నేతలు రాజీనామా చేశారు. 
 
పార్టీని వీడిన సీనియర్ నేతల్లో మాజీ ఉప ముఖ్యమంత్రి తారాచంద్, మాజీ మంత్రి అబ్దుల్ మాజిద్ వనీ, మనోహర్ లాల్ శర్మ, ఘారు రామ్ తదితరులు ఉన్నారు. వీరంతా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఉమ్మడిగా లేఖ రాశారు. 
 
"మా నేత, మార్గదర్శి గులాం నబీ ఆజాద్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన దారిలోనే మేం కూడా పార్టీని వీడాలని, ఒక సానుకూల రాజకీయ సమాజం కోసం పాటుపడాలని నిర్ణయించుకున్నాం. త్వరలోనే ఆజాద్ ఒక జాతీయ పార్టీని జమ్మూకాశ్మీర్ కోసం ప్రారంభిస్తారు. మేమందరం ఆయనతో కలిసి ఆ పార్టీలో ప్రయాణించాలని, ఆయనకు మద్దతుగా నిలిచి కాశ్మీర్‌కు ఒక మంచి భవిష్యత్‌ను అందిస్తాం" అని ఆ లేఖలో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments