Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కాంగ్రెస్ పార్టీకి మళ్లీ షాక్.. ఆజాద్ తర్వాత ఆ ముగ్గురు...?

gulam nabi azad
, బుధవారం, 17 ఆగస్టు 2022 (18:02 IST)
కాంగ్రెస్ పార్టీకి మళ్లీ షాక్ తగిలింది. జమ్మూ కశ్మీర్ రాష్ట్ర కాంగ్రెస్ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ పదవికి సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ రాజీనామా చేసిన కొద్ది గంటలకే మరో ముగ్గురు నేతలు జమ్మూ కశ్మీర్ రాష్ట్ర కాంగ్రెస్ క్యాంపెయిన్ కమిటీకి రాజీనామా చేశారు. ఇంత తక్కువ వ్యవధిలో నలుగురు కీలక నేతలు పార్టీ వీడడంతో ఇప్పటికే కశ్మీర్‭లో అంతంతగానే ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఇది పెద్ద ఎదురు దెబ్బని అంటున్నారు.
 
ఇందులో ఒకరు సోపోర్ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన హజి అబ్దుల్ రషిద్ కాగా మరో ఇద్దరు మహ్మద్ భట్, గుల్జర్ అహ్మద్ వని అని మీడియాలో వార్తలు వస్తున్నాయి.
 
కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతల్లో ఒకరైన ఆజాద్.. చాలా కాలంగా కాంగ్రెస్ అదిష్టానం తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలకు చాలా దూరంగా వున్నారు. తాజాగా తన పదవికి రాజీనామా చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డొమినోస్ క్వాలిటీ పుడ్‌.. పిజ్జా పిండిపై టాయిలెట్‌ బ్రష్‌లు, ఫ్లోర్‌ క్లీనర్స్