పుల్వామా అమర జవాన్లకు రూ. 110 కోట్ల భారీ విరాళం... ఆయన దేవుడు కాక మరేమిటి?

Webdunia
సోమవారం, 4 మార్చి 2019 (20:36 IST)
మానవ సేవే మాధవ సేవ అన్నారు. కష్టాల్లో వున్న తోటివారిని ఆదుకున్నవారిలో సాక్షాత్తూ భగవంతుడు కొలువై వుంటాడని అంటారు. అలాంటివారిలో ఓ మహానుభావుడు... పుల్వామా దాడిలో ప్రాణాలు కోల్పోయిన 40 మంది అమర జవాన్ల కుటుంబాలను ఆదుకునేందుకు రూ. 110 కోట్ల భారీ విరాళం ప్రకటించారు. ఆయన అంధుడు. సైంటిస్ట్.
 
వివరాల్లోకి వెళితే... ఫిబ్రవరి 14న పుల్వామాలో సీఆర్ఫీఎఫ్ కాన్వాయ్‌పై జరిగిన ఉగ్రవాద దాడిలో 40 మంది జవాన్లు అమరులయ్యారు. ఈ నేపథ్యంలో వారి కుటుంబాలను ఆదుకునేందుకు దేశ ప్రజలు తమవంతు సాయం చేస్తున్నారు. ఐతే రాజస్థాన్ కోటాకు చెందిన ముర్తజా ఏ అహ్మద్ భారీ సాయం ప్రకటించి అమరవీరుల కుటుంబాల పట్ల దాతృత్వాన్ని చూపారు. 
 
రూ. 110 కోట్లను జవాన్ల కుటుంబాలకు ఆర్థిక సాయంగా ఇస్తున్నట్లు ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మెయిల్ ద్వారా తెలియజేశారు. ఈయన అంధులైనప్పటికీ శాస్త్ర పరిశోధనలో వినూత్న ఆవిష్కరణలు అందిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు ఆధునాతన టెక్నాలజీని త్వరలో ఇండియన్ ఆర్మీకి అందించనున్నారు. మరోవైపు భారీ విరాళం ప్రకటించిన ఆయనను ఆ దేవుడు చల్లగా వుండాలని అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments