Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుల్వామా అమర జవాన్లకు రూ. 110 కోట్ల భారీ విరాళం... ఆయన దేవుడు కాక మరేమిటి?

Webdunia
సోమవారం, 4 మార్చి 2019 (20:36 IST)
మానవ సేవే మాధవ సేవ అన్నారు. కష్టాల్లో వున్న తోటివారిని ఆదుకున్నవారిలో సాక్షాత్తూ భగవంతుడు కొలువై వుంటాడని అంటారు. అలాంటివారిలో ఓ మహానుభావుడు... పుల్వామా దాడిలో ప్రాణాలు కోల్పోయిన 40 మంది అమర జవాన్ల కుటుంబాలను ఆదుకునేందుకు రూ. 110 కోట్ల భారీ విరాళం ప్రకటించారు. ఆయన అంధుడు. సైంటిస్ట్.
 
వివరాల్లోకి వెళితే... ఫిబ్రవరి 14న పుల్వామాలో సీఆర్ఫీఎఫ్ కాన్వాయ్‌పై జరిగిన ఉగ్రవాద దాడిలో 40 మంది జవాన్లు అమరులయ్యారు. ఈ నేపథ్యంలో వారి కుటుంబాలను ఆదుకునేందుకు దేశ ప్రజలు తమవంతు సాయం చేస్తున్నారు. ఐతే రాజస్థాన్ కోటాకు చెందిన ముర్తజా ఏ అహ్మద్ భారీ సాయం ప్రకటించి అమరవీరుల కుటుంబాల పట్ల దాతృత్వాన్ని చూపారు. 
 
రూ. 110 కోట్లను జవాన్ల కుటుంబాలకు ఆర్థిక సాయంగా ఇస్తున్నట్లు ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మెయిల్ ద్వారా తెలియజేశారు. ఈయన అంధులైనప్పటికీ శాస్త్ర పరిశోధనలో వినూత్న ఆవిష్కరణలు అందిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు ఆధునాతన టెక్నాలజీని త్వరలో ఇండియన్ ఆర్మీకి అందించనున్నారు. మరోవైపు భారీ విరాళం ప్రకటించిన ఆయనను ఆ దేవుడు చల్లగా వుండాలని అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

తర్వాతి కథనం
Show comments