Webdunia - Bharat's app for daily news and videos

Install App

మమతకు ఓటేయలేదని.. భార్య నోట్లో యాసిడ్ పోసిన భర్త..!

Webdunia
శనివారం, 27 ఏప్రియల్ 2019 (15:04 IST)
పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమత బెనర్జీకి చెందిన అభ్యర్థికి ఓటేయలేదని భార్య నోట్లో యాసిడ్ పోశాడో కిరాతకుడు. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికారపక్షంగా పాలన చేస్తోంది. ఈ పార్టీకి మమత బెనర్జీ నాయకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 11వ తేదీ పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలు జరిగాయి.
 
ఈ ఎన్నికల్లో ముషీరాబాద్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి తృణమూల్ కార్యకర్తగా, దీదీకి వీరాభిమానిగా వున్నాడు. ఇతడు ఎన్నికల్లో తన భార్య దీదీ పార్టీకి ఓటేయలేదని తెలుసుకుని కోపంతో ఊగిపోయాడు. మమత పార్టీకి ఓటేయమని ఎన్నిసార్లు చెప్పినా ఆమె పట్టించుకోకపోవడంతో ఆవేశంతో భార్యపై దాడికి దిగాడు. అంతటితో ఆగకుండా నోట్లో యాసిడ్ పోశాడు. 
 
దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు బాధితురాలి కుమార్తె ఇచ్చిన వాంగ్మూలంతో పోలీసులు తృణమూల్ కార్యకర్తను అరెస్ట్ చేశారు. ఇంకా యాసిడ్ బాధితురాలికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments