Webdunia - Bharat's app for daily news and videos

Install App

చౌకీదారే కానీ ధనవంతులకు మాత్రమే... ప్రియాంక వ్యంగ్యాస్త్రాలు

Webdunia
మంగళవారం, 19 మార్చి 2019 (12:32 IST)
గంగా యాత్ర పేరిట లోక్‍సభ ఎన్నికల ప్రచారాన్ని వినూత్నంగా ప్రారంభించిన ప్రియాంక గాంధీ తన ప్రచారంలో భాగంగా చౌకీదార్ ప్రధాన మంత్రిపై వ్యంగ్యాస్త్రాలు ఎక్కుపెట్టారు. వివరాలలోకి వెళ్తే... ‘‘నేను కాపలాదారును మాత్రమే’’ అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల ప్రారంభించిన ప్రచారంపై ఉత్తరప్రదేశ్-ఈస్ట్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 
 
‘‘వాళ్లు ధనవంతులకే కాపలాదారులు, రైతులకు కాదు..’’ అని ఆవిడ వ్యాఖ్యానించారు. ‘గంగా యాత్ర‌’ పేరుతో లోక్‌సభ ఎన్నికల కోసం వినూత్న ప్రచారం చేపట్టిన ప్రియాంక గాంధీ... ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలు, చిన్నారులు, యువకులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారనీ.. దీని వల్లే ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లో స్తబ్ధత నెలకొందని పేర్కొన్నారు.
 
కొందరు రాజకీయ జిమ్మిక్కులు ప్రదర్శిస్తున్నారనీ.. అందుకే ప్రజలు తమ ఇబ్బందులను తనతోనూ, తమతోటి కాంగ్రెస్ నాయకులతోనూ పంచుకుంటున్నారని ప్రియాంక చెప్పుకొచ్చారు. కాగా ఉత్తర ప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల విద్యార్ధులతో ప్రియాంక గాంధీ ‘‘బోట్ పే చర్చ’’ (పడవలో చర్చ) చేపట్టనున్నారు. ఈ నెల 21న ఆవిడ ప్రధాని మోడీ సొంత నియోజకవర్గం వారణాసిలో పర్యటించనున్నారు. విశ్వనాథుడి ఆలయాన్ని దర్శించుకుని, అక్కడ జరిగే హోలీ సంబరాల్లో ప్రియాంక పాల్గొనున్నట్లు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

థ్రిల్లర్ నేపథ్యంలో సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ చిత్రం 3 BHK

విజయ్ ఆంటోనీ మార్గన్ నుంచి సోల్ ఆఫ్ మార్గన్’ లిరికల్ వీడియో

డ్రగ్స్ కేసు : పోలీసుల అదుపులో కోలీవుడ్ హీరో శ్రీకాంత్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments