Webdunia - Bharat's app for daily news and videos

Install App

హనీప్రీత్ సింగ్ ఆ రోజంతా ఏడుస్తూనే వున్నది.. ఆహారపానీయాలు ముట్టుకోలేదు

డేరా బాబా గుర్మీత్ సింగ్‌కు శిక్షపడే ముందే రోజు హనీప్రీత్ తమ ఇంట్లో గడిపిందని రాజస్థాన్‌లోని హనుమాన్‌ఘర్‌కు చెందిన బంధువు తెలిపారు. డేరా బాబా గుర్మీత్‌కు శిక్షపడిన తర్వాత దత్త పుత్రిక హనీప్రీత్ పరారీల

Webdunia
శనివారం, 23 సెప్టెంబరు 2017 (11:29 IST)
డేరా బాబా గుర్మీత్ సింగ్‌కు శిక్షపడే ముందే రోజు హనీప్రీత్ తమ ఇంట్లో గడిపిందని రాజస్థాన్‌లోని హనుమాన్‌ఘర్‌కు చెందిన బంధువు తెలిపారు. డేరా బాబా గుర్మీత్‌కు శిక్షపడిన తర్వాత దత్త పుత్రిక హనీప్రీత్ పరారీలో ఉన్న సంగతి తెలిసిందే. పంచకుల కోర్టు నుంచి గుర్మీత్‌ను తప్పించేందుకు హనీప్రీత్ యత్నించిందనే ఆరోపణలతో ఆమెపై కేసు నమోదైంది. ఇంకా హనీప్రీత్ సింగ్‌పై లుకౌట్ నోటీసు కూడా జారీ అయ్యింది. ఈ సందర్భంగా ఆమె బంధువు ఓ కీలక విషయాన్ని తెలిపారు. 
 
గుర్మీత్‌కు శిక్ష పడే ముందు రోజు హనీప్రీత్ తమ ఇంట్లో గడిపిందని ఓ బంధువు చెప్పారు. ఆగస్టు 28న ఆమె తమ ఇంట్లో ఉందని... ఆ మరుసటి రోజు వెళ్లిపోయిందని చెప్పారు. ఆ రోజంతా హనీప్రీత్ ఆహారపానీయాలను కూడా ముట్టుకోలేదని వెల్లడించారు. చాలా టెన్షన్‌గా గడిపిందని.. రాత్రంతా ఏడుస్తూనే వుందని తెలిపారు. 
 
ఇదిలా ఉంటే.. డేరా బాబా రామ్ రహీం సింగ్‌కు చెందిన డేరా సచ్చా సౌదాకు రూ.74.96 కోట్లు వివిధ బ్యాంకుల్లో ఉన్నట్లు హర్యానా ప్రభుత్వం నిర్థారించింది. వేర్వేరు బ్యాంకులకు చెందిన పొదుపు, టెర్మ్ డిపాజిట్ ఖాతాల్లో ఈ సొమ్ము ఉన్నట్లు పేర్కొంది. వీటిలో రామ్ రహీం వ్యక్తిగత ఖాతాలు 12 ఉన్నట్లు, ఆయన పేరు మీద రూ.7.72 కోట్లు ఉన్నట్లు తెలిపింది. ఆయన దత్త పుత్రిక హనీప్రీత్ పేరు మీద 6 బ్యాంకు ఖాతాల్లో రూ. 1 కోటికిపైగా ఉందని పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' రిలీజ్‌కు ముందు మంచు విష్ణుకు షాకిచ్చిన జీఎస్టీ అధికారులు

డబ్బుల కోసం సినిమాలు చేయాలని లేదు, కన్నప్ప లో ప్రభాస్, విష్ణు పాత్రలు హైలైట్ : శివ బాలాజీ

ఎంటర్టైన్మెంట్, లవ్ స్టోరీ వర్జిన్ బాయ్స్ కి సెన్సార్ నుండి ఏ సర్టిఫికెట్

శ్రీశైలం దర్శనంతో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముగించిన మంచు విష్ణు

Kannappa first review : మంచు విష్ణు చిత్రం కన్నప్ప ఫస్ట్ రివ్యూ చెప్పేసిన నటుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments