Webdunia - Bharat's app for daily news and videos

Install App

హోం మంత్రి అమిత్ షా ప్రయాణిస్తున్న ఫ్లైట్ అత్యవసర ల్యాండింగ్

Webdunia
గురువారం, 5 జనవరి 2023 (08:40 IST)
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రయాణిస్తున్న విమానం అత్యవసరంగా ల్యాడింగ్ చేశారు. వాతావరణం అనుకూలించక పోవడంతో ఈ విమానాన్ని గౌహతి విమానాశ్రయంలో బుధవారం రాత్రి ఎమర్జెన్సీగా ల్యాండింగ్ చేశారు. దీంతో ఆయన ఆ రాత్రికి అక్కడే ఓ నక్షత్ర హోటల్‌లో బస చేశారు. గురువారం ఉదయం త్రిపురకు వెళ్లి అక్కడ రథయాత్రను ప్రారంభిస్తారు. 
 
త్రిపుర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇక్కడ బీజేపీ రథ యాత్రను ప్రారంభించనుంది. ఈ రథయాత్రను ప్రారంభించేందుకు అమిత్ షా బుధవారం రాత్రే అగర్తలకు చేరుకోవాల్సి వుంది. కానీ, వాతావరణం అనుకూలించకపోవడంతో బుధవారం రాత్రి 10.45 గంటల సమయంలో గౌహతి విమానాశ్రయంలో దించేశారు. 
 
గురువారం అగర్తలకు చేరుకుని అక్కడ బీజేపీ శ్రేణులు ఏర్పాటు చేసిన జన బిశ్వాస్ రథ యాత్రను ప్రారంభిస్తారు. ఆ ర్వాత ధర్మనగర్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. గురువారం మధ్యాహ్నం ఓ కార్యకర్త ఇంటిలో ఆయన భోజనం చేస్తారు. ఆ తర్వాత దక్షిణ త్రిపురలోని సబ్రూమ్‌కు బయలుదేరి వెళతారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments