Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనంత్‌నాగ్‌లో ఎన్‌కౌంటర్.. హిజ్బుల్ కీలక ఉగ్రవాది హతం

Webdunia
శనివారం, 4 జూన్ 2022 (10:02 IST)
జమ్మూ కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఎన్‌కౌంటర్‌లో హిజ్బుల్ ముజాయిద్దీన్ ఉగ్రవాద సంస్థ కమాండర్ హతమయ్యాడు. దక్షిణ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా రిషిపోరా గ్రామం కప్రాన్ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. 
 
శనివారం తెల్లవారుజామున ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో నిషేధిత ఉగ్రవాద సంస్థ హిజ్బుల్-ఉల్-ముజాహిదీన్ టెర్రరిస్ట్ కమాండర్ నిసార్ ఖండే హతమైనట్టు కశ్మీర్ జోన్ ఐజీ విజయ్ కుమార్ తెలిపారు. 
 
ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు జవాన్లు, ఓ పౌరుడు గాయపడినట్టు పేర్కొన్నారు. వీరిని తక్షణమే శ్రీనగర్‌లోని 92 బేస్ హాస్పిటల్‌కు తరలించి, చికిత్స అందజేస్తున్నామని చెప్పారు. వారి పరిస్థితి నిలకడగా ఉందని వివరించారు.
 
ఉగ్రవాది నుంచి ఏకే 47 రైఫిల్‌, పేలుడు పదార్థాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని విజయ్ కుమార్ ట్వీట్ చేశారు.  
 
గాలింపులో ఇద్దరు ఉగ్రవాదుల ఆచూకీ లభించిందని, ఆపరేషన్ పూర్తయిన తర్వాత మృతుల సంఖ్యను ప్రకటిస్తామని పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ జరిగిన 56వ ఎన్‌కౌంటర్ ఇది. ఇంతకు ముందు జరిగిన ఆపరేషన్‌లలో 26 మంది పాకిస్థానీలతో సహా 89 మంది ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas and Anushka: ప్రభాస్‌తో కలిసి నటిస్తాను అంటోన్న దేవసేన (video)

Krish: పవన్ కళ్యాణ్ అంటే అభిమానమే.. - ఇప్పుడు సినిమా లైఫ్ మూడు గంటలే : క్రిష్ జాగర్లమూడి

అథర్వా మురళి నటించిన యాక్షన్ థ్రిల్లర్ టన్నెల్

అంకిత్ కొయ్య, నీలఖి ల కెమిస్ట్రీ, స్కూటీ చుట్టూ తిరిగే బ్యూటీ గా లవ్ సాంగ్‌

Rehman: ఏఆర్ రహ్మాన్ బాణీలతో రామ్ చరణ్ పెద్ది ఫస్ట్ సింగిల్ సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments