Webdunia - Bharat's app for daily news and videos

Install App

'మహాత్మా గాంధీ'ని తుపాకీతో కాల్చిన ఝాన్సీ అరెస్టు

Webdunia
బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (12:01 IST)
జాతిపిత వర్థంతి రోజున మహాత్మా గాంధీ గడ్డి బొమ్మను తుపాకీతో కాల్చిన అఖిల భారత మహాసభ నాయకురాలు పూజా పాండేను పోలీసులు అరెస్టు చేశారు. ఆమెతో పాటు భర్త అశోక్ పాండేలను కూడా పోలీసులు కటకటాల వెనక్కి పంపించారు. 
 
గాంధీ 71వ వర్థంతి వేడుకల రోజున హంతకుడు గాడ్సే మాతృసంస్థ హిందూ మహాసభ ఆధ్వర్యంలో గాడ్సే మహావీరుడుగా పేర్కొంటూ ఓ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో పూజా పాండేతో పాటు అశోక్ పాండేలు మరికొంతమంది హిందూ మహాసభ కార్యకర్తలు పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా మహాత్మా గాంధీ గడ్డి బొమ్మను ఆ సంస్థ సభ్యులందరూ హర్షధ్వానాలు చేస్తుండగా.. హిందూ మహాసభ జాతీయ కార్యదర్శి పూజా శకున్‌ పాండే.. గాంధీజీ గడ్డిబొమ్మపై తుపాకీతో కాల్పులు జరిపారు. ఆ తర్వాత గాంధీకి వ్యతిరేకంగా, గాడ్సేకు అనుకూలంగా నినాదాలు చేశారు. 
 
దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వారిపై యూపీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై యూపీ పోలీసులు కేసు నమోదు చేయడంతో పూజా పాండేతో పాటు ఆమె భర్త పారిపోయారు. వారి కోసం గాలించిన పోలీసులు.. ఎట్టకేలకు అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments