Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో 26 వరకు మూసివేత

Webdunia
ఆదివారం, 9 జనవరి 2022 (15:54 IST)
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల 26వ తేదీ వరకు విద్యా సంస్థలను మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలో కరోనా వైరస్ థర్డ్ వేవ్ ప్రభావం తీవ్రంగా ఉంది. దీంతో పలు రాష్ట్రాలు అప్రమత్తమై ముందస్తు చర్యలు చేపడుతున్నాయి. ఇందులోభాగంగా, స్కూల్స్, కాలేజీలను మూసివేస్తున్నాయి. ఈ క్రమంలో ఈ నెల 26వ తేదీ వరకు అన్ని రకాల విద్యా సంస్థలను మూసి వేయాల్సిందిగా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
 
ఈ మేరకు ఆదివారం ముఖ్యమంత్రి, వైద్య, పోలీసు అధికారులతో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో నిర్ణయించారు. విద్యార్థుల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీఎం తెలిపారు.  అదేసమయంలో కోవిడ్ నిర్ధారణ పరీక్షలను మెరుగుపరచాలని, కోవిడ్ క్లస్టర్లను సమర్థవంతంగా పర్యవేక్షించాలని ఆయన అధికారులను ఆదేశించారు. 
 
అలాగే, కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా అస్సాం రాష్ట్రంలో కూడా ఐదో తరగతి వరకు విద్యా సంస్థలను మూసివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అదేవిధంగా కర్ఫ్యూ సమయం కూడా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అమల్లో ఉంటుందని అధికారులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments