Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్యాంగ్ స్టర్ ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి.. స్లో పాయిజన్ ఇచ్చారా?

సెల్వి
శుక్రవారం, 29 మార్చి 2024 (11:42 IST)
Mukthar ansari
ప్రముఖ గ్యాంగ్ స్టర్, ఆతరువాత రాజకీయ నాయకుడిగా మారిన ముఖ్తార్ అన్సారీ జైలులో గుండెపోటుతో మృతి చెందాడు. అన్సారీ మృతితో యూపీలో హై అలెర్ట్ నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ విధించింది. 
 
1997 నుంచి 2022 వరకు మౌ అసెంబ్లీ స్థానానికి ఆయన ప్రాతినిధ్యం వహించారు. 60 ఏళ్ల అన్సారీని మరణించినట్లు ప్రకటించడానికి కొద్దిసేపటి ముందు బాందా జైలు నుంచి రెండోసారి రాణి దుర్గావతి మెడికల్ కాలేజీకి తీసుకొచ్చారు. అంతకుముందు, కడుపునొప్పి రావడంతో మంగళవారం కూడా ఆయనను ఆసుపత్రికి తీసుకువచ్చారు. 
 
గురువారం రాత్రి అన్సారీ గుండెపోటుతో మరణించినట్లు ఆస్పత్రి వర్గాలు బులిటెన్‌లో ధ్రువీకరించాయి. కాగా, గ్యాంగ్ స్టర్ అన్సారీ మరణంపై ఆయన కుమారుడు ఉమర్ అన్సారీ స్పందించాడు. తన తండ్రికి జైలులో ఆహారం ద్వారా స్లో పాయిజన్ ఇచ్చారని ఆయన ఆరోపించారు. ఈ విషయంపై తమ కుటుంబం కోర్టును ఆశ్రయిస్తుందని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shwetha Menon: AMMA ప్రెసిడెంట్‌గా తొలి మహిళా నటిగా రికార్డ్

Viswant: భావనను వివాహం చేసుకున్న హీరో విశ్వంత్ దుడ్డుంపూడి

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments