Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో బీజేపీకి మరో అసెంబ్లీ సీటు వస్తుంది : బీజేపీ స్టేట్ చీఫ్ పురంధేశ్వరి

వరుణ్
శుక్రవారం, 29 మార్చి 2024 (11:34 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి మరో అసెంబ్లీ సీటు అంటే 11వ సీటు రానుందని, ఆ సీటులో ఎవరు పోటీ చేయాలన్నది తమ పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని భారతీయ జనతా పార్టీ ఏపీ శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ, ఏపీ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసమే టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి పోటీ చేస్తున్నాయన్నారు. తమ పార్టీలో ఉన్నపాతవారు, కొత్తవారు అందరూ బీజేపీ నేతలేనని చెప్పారు. తమ పార్టీకి ఏపీలో అసెంబ్లీ సీట్లు పెరగనున్నాయని తెలిపారు. త్వరలోనే మరో సీటు వస్తుందన్నారు. ఆ 11వ సీటులో ఎవరు పోటీ చేయాలన్నది పార్టీ అధినాయకత్వం నిర్ణయిస్తుందన్నారు. 
 
తమ పార్టీ ఏపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు భవితవ్యాన్ని పార్టీ అధిష్టానం ఖరారు చేస్తుందన్నారు. తమ పార్టీలోకి వలస వచ్చినవారికి మాత్రమే టిక్కెట్లు కేటాయించిందంటూ సాగుతున్న ప్రచారాన్ని ఆమె కొట్టిపారేశారు. స్థానిక పరిస్థితులు, సామాజిక అంశాలను పరిగణనలోకి తీసుకుని టిక్కెట్లు కేటాయించడం జరిగిందన్నారు. ఉద్దేశ్యపూర్వకంగా ఎవరినీ పక్కనపెట్టలేదన్నారు. పార్టీ హైకమాండ్ తీసుకునే పార్టీ నేతలు, కార్యకర్తలు కట్టుబడివుండాలన్నారు. కాగా, ఏపీలో 10 అసెంబ్లీ, 6 లోక్‌సభ సీట్లలో బీజేపీ పోటీ చేస్తున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments