Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళా ఏసీపీ చేతి వేళ్లను నరికేసిన వ్యాపారి... ఎక్కడ?

Webdunia
బుధవారం, 1 సెప్టెంబరు 2021 (11:45 IST)
ఓ వ్యాపారి పట్టరాని కోపం వచ్చింది. అంతే.. ఓ మహిళా ఏసీపీ చేతి వేళ్లను నరికేశాడు. అక్రమంగా ఏర్పాటు చేసిన దుకాణాలను ఖాళీ చేయించేందుకు వెళ్లిన పోలీసులపై కూడా దౌర్జన్యం చేశారు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, థానేలో రోడ్లు, ఫుట్‌పాత్‌లపై వీధి వ్యాపారులు కొందరు అక్రమంగా దుకాణాలను ఏర్పాటు చేసుకున్నారు. ఇవి పాదాచారులతో పాటు.. వాహనరాకపోకలకు తీవ్ర అంతరాయంగా మారాయి. దీంతో ఈ దుకాణాలను ఖాళీ చేయించాలని థానే మునిసిపల్ కార్పొరేషన్ నిర్ణయించింది. 
 
ఈ మేరకు ఆ శాఖ కమిషనర్ డాక్టర్ విపిన్ శర్మ ఆదేశాలతో పోలీసులు రంగంలోకి దిగారు. అధికారులతో కలిసి దుకాణాలు, తోపుడు బండ్లను ఖాళీ చేయిస్తున్నారు. ఘోడ్‌బందర్ రోడ్డులో సోమవారం సాయంత్రం ఇలానే దుకాణాలు ఖాళీ చేయిస్తుండగా కూరగాయల వ్యాపారి అమర్జీత్ యాదవ్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ కల్పితా పింపుల్‌పై కత్తితో దాడిచేశాడు. 
 
ఈ ఘటనలో ఆమె మూడు వేళ్లు తెగిపోయాయి. ఆమె తలకు కూడా గాయాలయ్యాయి. వెంటనే ఆమెను ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో ఏసీపీతోపాటే ఉన్న సెక్యూరిటీగార్డు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. నిందితుడు అమర్జీత్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments