Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా టీకా వేయించుకుంటేనే ప్రభుత్వ ఉద్యోగులకు వేతనం... ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (18:09 IST)
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు అన్ని రాష్ట్రాలు ముమ్మరంగా కృషి చేస్తున్నాయి. ఇందులోభాగంగా కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను వేగిరం చేశాయి. ఇలాంటి రాష్ట్రాల్లో పుదుచ్చేరి ఒకటి. 
 
అయితే, అనారోగ్య సమస్యల కారణంగా, ఇతర భయాల కారణంగా టీకాలు వేయించుకునేందుకు మొగ్గు చూపడం లేదు. ఇలాంటి వారిలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు. ఇలాంటి వారికి పుదుచ్చేరి గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ తేరుకోలేని షాకిచ్చారు. 
 
కరోనా టీకా వేసుకోని ఉద్యోగుల జీతంతోపాటు దీపావళి బోనస్ కూడా ఇవ్వబోమని ప్రకటించారు. వ్యాక్సిన్ తీసుకున్న వారికే ఈ రెండూ లభిస్తాయని స్పష్టం చేశారు. కరోనా వ్యాక్సిన్‌పై అవగాహన ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఈ ప్రకటన చేశారు. 
 
టీకా ఆవశ్యకతను వివరించేలా సైకిల్ ర్యాలీని ఆమె ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని సైనికులు పిలుపునిచ్చారు. రాజ్ నివాస్ ఆవరణ నుంచి ఈ ర్యాలీ ప్రారంభమైంది. దీన్ని పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ జెండా ఊపి ఆరంభించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments